• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి’

ఆసిఫాబాద్ జిల్లాలో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలని కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అన్ని విభాగాల అన్ని రకాల అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 05:28 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

NRPT: మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సరస్వతి జనార్దన్ తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలపై విచారించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్ పావనిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

February 21, 2026 / 05:25 PM IST

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. వ్యక్తికి తీవ్ర గాయాలు

నల్గొండ: శాలిగౌరారం మండలం మాదారం కలాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్వపల్లి నుండి నకిరేకల్ వైపు భైక్‌పై వస్తున్న ఊట్కూరి వీరయ్య డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది వెంటనే చేరుకుని గాయపడిన వీరయ్యను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 05:25 PM IST

మాజీ MLA సతీమణికి జాతీయ ST కమిషన్ సభ్యుడు నివాళి

HNK: వర్దన్నపేట మాజీ MLA వన్నాల శ్రీరాములు సతీమణి విజయ ప్రథమ వర్ధంతి కార్యక్రమం హంటర్ రోడ్డులో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ చిత్రపటం వద్ద ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాణాప్రతాప్ తదితరులున్నారు.

February 21, 2026 / 05:24 PM IST

CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన : MLA

WGL: ఖానాపురం(M) బుధరావుపేట గ్రామంలో ఇవాళ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శనివారం MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మహిళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో మొదటి ఏడాదిలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని తెలిపారు.

February 21, 2026 / 05:23 PM IST

నాటుసారా కేంద్రంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్

HYD: పల్లెచలుక తండాలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎన్ ఫోర్స్ మెంట్, సరూర్ నగర్ డీటీఎఫ్, అమనగల్ ఎక్సైజ్ సిబ్బంది ఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. 8 లీటర్ల నాటుసారా, 580 లీటర్ల బెల్లం పానాకం ధ్వంసం చేశారు. ఇస్లావత్ హిరియా సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, మరో నలుగురిపై కేసులు నమోదు చేసి గాలిస్తున్నారు.

February 21, 2026 / 05:21 PM IST

యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం: కలెక్టర్

SRD: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

February 21, 2026 / 05:20 PM IST

‘విద్యా విహారాలు.. పరిశోధనాసక్తి పెంపొందిస్తాయి’

SDPT: సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బయోటెక్నాలజీ, రసాయన శాస్త్ర విభాగాల విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో శనివారం ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఈ విద్యా విహారాలు విద్యార్థులలో పరిశోధనాసక్తిని పెంపొందిస్తాయని కాలేజ్ ప్రిన్సిపాల్ డా జి. సునీత తెలిపారు. నిర్వాహకులను ఆమె అభినందించారు.

February 21, 2026 / 05:20 PM IST

సేవ చేయడం గొప్ప లక్షణం: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో శనివారం నిర్వహించిన NSS స్పెషల్ క్యాంప్‌కు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. సేవ చేయడం గొప్ప లక్షణం విద్యార్థి దశనుంచే సేవలు చేసే గుణం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బొజ్జాయిగూడెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.

February 21, 2026 / 05:09 PM IST

రేపు జిల్లాకు రానున్న CM

MLG: CM రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 10గం కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు పర్యటనకు ముఖ్యఅతిథిగా CM రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై CM పర్యటనను విజయవంతం చేయాలన్నారు.

February 21, 2026 / 05:08 PM IST

‘ప్రేరణ విజయానికి తొలి అడుగు’

MDK: శివంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫౌండేషన్, గురుకులం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘ప్రేరణ విజయానికి తొలి అడుగు’ కార్యక్రమ నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధనకు మార్గదర్శనం చేయడానికి కార్యక్రమం చేపట్టినట్లు కో- ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు.

February 21, 2026 / 05:08 PM IST

ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎంపీడీవో

PDPL: ధర్మారం మండలం కొత్తూరు అంగన్వాడి, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపీడీవో వేముల సుమలత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ZP పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో సంభాషించారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ సందర్శించారు. మధ్యాహ్న భోజనం, ప్రత్యేక స్టడీ అవర్స్ గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య సంగీత పాల్గొన్నారు.

February 21, 2026 / 05:07 PM IST

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

ADB: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.

February 21, 2026 / 05:07 PM IST

ఎలిప్యాడ్‌ను పరిశీలించిన ఎస్పీ

SRCL: గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలో ఏర్పాట్లను,హెలిప్యాడ్‌ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని తెలిపారు.

February 21, 2026 / 05:05 PM IST

ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ కార్యక్రమం

KMM: ఎర్రుపాలెం మండలం నారాయణపురంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మధిర మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడారు. ఆయిల్ పామ్ లాభదాయక పంటగా మారుతోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

February 21, 2026 / 05:05 PM IST