VKB: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. నిన్న జిల్లాలోని పరీక్షా కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
BHNG: భువనగిరి 28వ వార్డు మీనానగర్లో దెబ్బతిన్న రోడ్డుకు కౌన్సిలర్ సూదగాని సరిత రాజు సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. వినూత్న హాస్పిటల్ నుంచి కేజేఆర్ టాకీస్ వరకు రహదారి శిథిలావస్థకు చేరి వాహనదారులు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిధుల కోసం వేచి చూడకుండా, ప్రజా సౌకర్యార్థం ఆమె తక్షణ చర్యలు చేపట్టారు. ఈ చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
NZB: బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని ఆర్మూర్ మున్సిపల్ నూతన ఛైర్పర్సన్ గోనే లహరి రఘు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న జరగనున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని ఆమె ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి ఉన్నారు.
SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వాళ హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు హుజూర్నగర్ చేరుకుని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న హౌజింగ్ కాలనీని పరిశీలించనున్నారు. అనంతరం చింతలపాలెం మండలం దొండపాడు, పాలకవీడు మండలం జాన్పహాడ్లోని లిఫ్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను ఛైర్మన్గా ఎన్నికైనందున వెంటనే తనను ఛైర్మన్గా ప్రకటించాలని ఇప్పటికే సుదర్శన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
JGL: పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాచకొండ ధర్మయ్య అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మయ్య కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. దవాఖానలో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో సోమవారం ఇంట్లోనే దూలానికి ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు
ADB: తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. బాన్స్ వాడలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ పట్టణంలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
NLG: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో 99. 56 పర్సంట్తెల్ సాధించిన రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ విద్యార్థులు ముక్కా చరణ్ సాయి గౌడ్, ఐ. కృష్ణ చరణ్, 95.63, సిహెచ్ భాను శంకర్ 94.78 విజయ్ చరణ్ 92.52, జె ప్రవీణ్ 92.16 లను. సోమవారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
NRPT: దామరగిద్ద మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ (SHE Teams) పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల రక్షణ, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, ర్యాగింగ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి స్వయం సమృద్ధి సాధించాలని పోలీసులు బాలరాజ్, చెన్నప్ప, జ్యోతి పేర్కొన్నారు.
NGKL: HYDలోని జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. లాన్ టెన్నిస్ నాన్-గెజిటెడ్ అధికారుల టీమ్ ఈవెంట్లో జిల్లా జట్టు 3వ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. విజేతలను ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.
PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఇటీవల మొలుగూరి కొమురయ్యపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు బుర్ర రాజ కొమురయ్యను ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేష్ తెలిపారు. పాత కక్షలతో తమ్ముడిపై దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన అన్న కొమురయ్య పై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.
WNP: అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, డయాబెటిస్ రోగులకు అందించే సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని వనపర్తి DMHO సాయినాథెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. అందుకు సంబంధించి సోమవారం DMHO కార్యాలయంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. బీపీ, షుగర్కు మందులను పీహెచ్సీలో అందుబాటులో ఉంచి, జీవనశైలి మార్పులపై అవగాహన పెంచాలన్నారు.
SRD: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25వ తేదీన కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగులకు 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
NZB: మోపాల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కారోబార్స్, పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలను చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామపంచాయతీలో వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు తెలిపారు. కుటుంబ సర్వే నిర్వహించి సంవత్సర కాలం గడుస్తున్నా ఎన్యుమరేటర్లు గౌరవ వేతనం అందలేదన్నారు.