• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జక్కాపూర్లో ఎన్ఎస్ఎస్ స్వచ్ఛ భారత్ ర్యాలీ

SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 3వ యూనిట్ ఆధ్వర్యంలో జక్కాపూర్ గ్రామంలో ప్రత్యేక శీతాకాల శిబిరం కొనసాగుతోంది. శిబిరం రెండో రోజు వాలంటీర్లు గ్రామంలోని అన్ని వీధుల్లో స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. నినాదాలు, పాటల ద్వారా పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాన్ని నిర్మలంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

February 26, 2026 / 07:57 PM IST

బాధిత కుటుంబానికి CMRF చెక్కు పంపిణీ

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన సుద్ధకంటి బాలమ్మకు మంజూరైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కును కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి గురువారం అందించారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలికి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి సాకారంతో ఈ ఆర్థిక సాయం అందింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

February 26, 2026 / 07:54 PM IST

నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్‌ను సత్కరించిన ఎంపీ

నల్గొండ తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ఎన్నికైనటువంటి శ్రీమతి శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ భువనగిరి ఎంపీ చామలను ఘనంగా సత్కరించారు.

February 26, 2026 / 07:51 PM IST

టెన్త్ విద్యార్థులకు నగదు బహుమతికి హామీ

NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHSలో ఎన్పీ ఫౌండేషన్ పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతిని ప్రకటించారు. ఫౌండేషన్ ఛైర్మెన్, సెక్రెటరీ తన్నీరు నిర్మలాదేవి, రాం ప్రభు విద్యార్థులకు ఇవాళ రాత సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రంలో హెచ్‌ఎం రమాదేవి, నర్సింగ్ రాజు, చిట్టిబాబు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:47 PM IST

రూ.151 కే భద్రాచలం తలంబ్రాలు

NZB: భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు.

February 26, 2026 / 07:47 PM IST

మహబూబాబాద్‌లో మెగా ఫ్రెయిట్ డిపోకు వినతి

MHBD: మహబూబాబాద్ పట్టణంలో రైల్వేమెగా ఫ్రెయిట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని సాధన కమిటీ ప్రతినిధులు నేడు సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మల్లాడిని కలిసి విజ్ఞప్తి చేశారు. డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపాదనలను రైల్వే బోర్డు ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు.

February 26, 2026 / 07:46 PM IST

ఒక్కటైన తెలుగు అబ్బాయి.. జపాన్ అమ్మాయి..!

SRPT: ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి పీటలెక్కింది. మేళ్లచెరువుకు చెందిన వరగాని రాజేశ్ సాఫ్ట్‌వేర్. ఉద్యోగ రీత్యా జపాన్ వెళ్లి, అక్కడ టోక్యోకు చెందిన వకానాతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో బుధవారం ఖమ్మంలో వీరు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, విదేశీ వధువు మన సంస్కృతిలో మెరిసిపోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

February 26, 2026 / 07:46 PM IST

అప్పటి GHMC యాప్.. ఇప్పుడు My CURE

HYD: అప్పటి GHMC యాప్, ఇప్పుడు My CURE యాప్ అయింది. ఈ యాప్ జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సేవలు అందించడానికి ఉపయోగించేలా రూపొందించారు. My CURE అంటే మై కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ఈ పేరు పెట్టారు. మూడు కార్పొరేషన్ల ప్రజలు ఈ యాప్ యూజ్ చేసుకుని ఫిర్యాదు చేయాలని సూచించారు.

February 26, 2026 / 07:45 PM IST

బాధితుడి చెంతకే పోలీస్.. ఆసుపత్రిలో కేసు నమోదు..!

సూర్యాపేట: ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని సూర్యాపేట పోలీసులు నిరూపించారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుడెల్లి రంగా వద్దకు ఎస్సై మహేంద్రనాథ్ స్వయంగా వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు లింగయ్యపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉన్న బాధితులకు తక్షణమే స్పందించి న్యాయం చేస్తామని ఎస్సై అన్నారు.

February 26, 2026 / 07:43 PM IST

రేపు దమ్మపేటలో ఎమ్మెల్యే పర్యటన

BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రేపు దమ్మపేట మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి వట్టి వెంకట్రావు నేడు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్ హెచ్ జి భవన శంకుస్థాపన, జిపిఎస్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన, అంగన్వాడి భవనం ప్రారంభోత్సవం, సిసి రోడ్డు శంకుస్థాపన, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.

February 26, 2026 / 07:43 PM IST

బ్రహ్మోత్సవాల్లో రేపటి విశేష పూజలు

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం విశేష వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం మహోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:00 గంటలకు పుష్పయాగము, ద్వాదశి ఆరాధన, దేవతోద్వాసన, ధోపోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

February 26, 2026 / 07:41 PM IST

గుంజేడు ముసలమ్మ జాతరలో భక్తుల కోసం ఏర్పాట్లు

MHBD: కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ దేవాలయం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో కోటి రూపాయలు వ్యయంతో భక్తుల కోసం 5 వసతి గృహలు, కాటేజీలు, 10 షాపింగ్ కాంప్లెక్స్, వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసారు. వీటిని మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేశామని, సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు.

February 26, 2026 / 07:40 PM IST

విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

WNP: పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తాండాలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్వేతాచల శ్రీనివాస స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

February 26, 2026 / 07:40 PM IST

‘మెనూ ప్రకారం భోజనం పెట్టాలి’

NZB: మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని బిక్కనూర్ ఎంఈవో రాజగంగారెడ్డి ఆదేశించారు. గురువారం బస్వాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన భోజనం అందించకపోతే ఏజెన్సీలు రద్దు చేస్తామని హెచ్చరించారు.

February 26, 2026 / 07:39 PM IST

నేతి విద్యాసాగర్ ను కలిసిన నేతలు

NLG: చిట్యాల 1వ వార్డుకు చెందిన మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ ఎడ్ల పద్మ, కాంగ్రెస్ నాయకుడు మహలింగం యాదవ్ దంపతులు మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించామని, దీనిపై విద్యాసాగర్ సానుకూలంగా స్పందిస్తూ.. నేను ఉన్నాను, అంటూ ధైర్యం చెప్పారని వారు పేర్కొన్నారు.

February 26, 2026 / 07:39 PM IST