MNCL: కోటపల్లి మండలం అర్జునగుట్ట గ్రామంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. తనిఖీల్లో నిల్వ ఉంచిన ప్రభుత్వ నిషేధిత గుడుంబాను తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
ADB: కంది పంటతోపాటు కోతకు వచ్చిన శనగ పంటను మద్దతు ధరతో త్వరగా కొనుగోలు చేయాలని జైనథ్ మండల రైతులు కోరారు. సోమవారం MLA పాయల్ శంకర్ను కలిసి యాసంగి పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. మార్కెట్ యార్డులో జొన్న, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
BDK: ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుని దేవాలయంలో సోమవారం కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేణుగోపాల స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని అభినందించారు.
JGL: రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామంలో సోమవారం శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ద్వి దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. రాయికల్, బోర్నపల్లి, వస్తాపూర్, ఒడ్డె లింగాపూర్ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం లక్ష్మి రామానంద్ అన్నారు. నర్సంపేట 9,12వ వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లతో కలిసి ఛైర్పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ గంధం నరేందర్ గుప్తా, తదితరులు ఉన్నారు.
SRD: విద్యార్థులు చదువుతూపాటు క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సి.యం. కప్ పోటీలలో జిల్లా స్థాయిలో విజయం సాధించి, రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండవ, మూడవ స్థానంలో సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సోమవారం అభినందించారు. ఆరోగ్యానికి ఆటలు ఎంతగానో అవసరమని సూచించారు.
NLG: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలను నల్గొండ పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి అనంతరం బీజేపీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా బూర నర్సయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్రజాసేవలో ఎప్పుడు ఉంటూ సేవ చేస్తానని అన్నారు.
PDPL: 2027లో జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రణాళికాబద్ధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో ఇవాళ ఆయన సీపీ అంబర్ కిషోర్ జాతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. స్నానాల కోసం ఘాట్, రోడ్లు, లైటింగ్, ఆలయాల అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
MDK: ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కొత్తగా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
KMM: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
RR: కొత్తూరు మున్సిపాలిటీలో ఇంటి పన్నులు తగ్గించాలని యువ నాయకుడు రవీందర్ యాదవ్, కొత్తూరు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇంటి పన్నుల భారాన్ని భరించలేక పోతున్నారని, మున్సిపాలిటీలో ఇంటి పన్నులు తగ్గించి ఎన్ఆర్ఈజీఎస్ కూలీ పనులు మున్సిపాలిటీలకు వర్తింపజేయాలని కోరారు.
ADB: పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా శాఖల వారీగా సమీక్షించి, నిర్ణీత గడువులో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
BHNG: బాల్య వివాహల నిర్మూలన కొరకు స్కోప్ స్వచ్ఛంద సంస్థ ప్రచార రథం మోత్కూరు మండల కేంద్రంకు విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవింద రాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మార్వో జ్యోతి హాజరై మాట్లాడుతూ.. బాల్య వివాహల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
KNR: పురపాలక పరిధిలోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని పేర్కొన్నారు. సోమవారం ఆమె 1వ వార్డులో పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మేకల స్వరూప పాల్గొన్నారు.
KMM: ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. MAR 6 నుంచి JUN 12 వరకు ప్రభుత్వ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.