• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ముగిసిన శిక్షణ.. ధృవీకరణ పత్రాలు అందజేత

RR: తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (TGIRD) ఆధ్వర్యంలో జిల్లా సర్పంచ్‌ల కోసం నిర్వహించిన ఐదు రోజుల ‘జనరల్ ఓరియంటేషన్’ శిక్షణా కార్యక్రమం ముగిసింది. ముచ్చింతల్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్ వేదికగా జరిగిన ఈ శిక్షణలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి సర్పంచులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

February 27, 2026 / 09:25 PM IST

వరి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి: అ. కలెక్టర్

VKB: రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు 129 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 27, 2026 / 09:21 PM IST

విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

NGKL: కల్వకుర్తి పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన జిల్లా యువజన అధికారి కోట నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

February 27, 2026 / 09:19 PM IST

FPOకి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు

KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (FPO)కు 2025 సం. గాను NCDC భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం “కోఆపరేటివ్ ఎక్సలెన్స్ & మెరిట్-2025″ అవార్డు లభించింది. ఈ అవార్డును HYDలోని TGCAB కార్యాలయంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా తీసుకున్నారు.

February 27, 2026 / 09:09 PM IST

ఉమామహేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం

SDPT: బెజ్జంకి(మం) దాచారంలోని ఉమామహేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్పంచ్ బైరా మానస ఆధ్వర్యంలో దేవతలకు పట్టు వస్త్రాలు, సంప్రదాయ కానుకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాలనర్స్, వార్డ్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 27, 2026 / 09:04 PM IST

గద్వాలలో నూతన కలెక్టర్ సూచనలు

గద్వాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో జరిగిన సమావేశంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

February 27, 2026 / 09:01 PM IST

కంటి పరీక్షలు చేయించిన పోలీసులు

NRML: ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్ సూచించారు. రోడ్డు భద్రతా నియమాల్లో భాగంగా శుక్రవారం ఖానాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని కంటి ఆసుపత్రిలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఉన్నారు.

February 27, 2026 / 09:01 PM IST

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఉద్యోగుల తొలగింపు

HYD: మంత్రి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రసాదం నాణ్యత, శుభ్రతపై ఆరా తీసి శాంపిళ్లు పరీక్షలకు పంపించారు. 200 గ్రాముల పులిహోర ప్యాకెట్ 150 గ్రాములే ఉండటాన్ని గుర్తించారు. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఒక పూజారిని తొలగించారు. EO, సూపరింటెండెంట్ సస్పెన్షన్‌కు ఆదేశించినట్లు సమాచారం.

February 27, 2026 / 08:58 PM IST

సిర్పూర్ శివారులో అస్థిపంజరం లభ్యం

NZB: మోపాల్ మండలం సిర్పూర్ శివారులోని గుట్ట వద్ద ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ అస్థిపంజరం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా మృతదేహం నెల రోజుల క్రితం గల్లంతైన ఈర్ల సాయిలుగా గుర్తించారు.

February 27, 2026 / 08:55 PM IST

మంచ్య తండా పాఠశాలలో ‘సెల్ఫ్ గవర్నమెంట్ డే’

SRPT: మంచ్య తండా ఎంపీపీఎస్ పాఠశాలలో ‘సెల్ఫ్ గవర్నమెంట్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయుల వేషధారణలో చిన్నారులు అలరించడమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, బాధ్య తాభావంతో తరగతులు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రామిరెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.

February 27, 2026 / 08:54 PM IST

భక్తజన సముద్రమైన భీమేశ్వర ఆలయం

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శుక్రవారం సందర్భంగా భక్తజన సంద్రమైంది . వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూజ , కళ్యాణం, తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు.

February 27, 2026 / 08:49 PM IST

రూ.1.18 లక్షల జరిమానా..!

KMR: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెస్తున్న వారిపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. SP రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 119 మందికి శుక్రవారం కోర్టు జరిమానాతో పాటు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుల్లో నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రూ.1,18,100 జరిమానా విధించింది.

February 27, 2026 / 08:48 PM IST

86 గ్రాముల హైడ్రోపోనిక్ గాంజా స్వాధీనం

SRD: మునిపల్లి(మం) కంకుల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు జిల్లాలో తొలిసారిగా ఎన్వారి గ్రాముల హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కేరళకు చెందిన బాబు 30 గోవా నుంచి హైదరాబాద్‌కు గాంజా తరలిస్తుండగా పట్టుకున్నారు. 3.5 లక్షల విలువ ఉంటుందని ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ తెలిపారు.

February 27, 2026 / 08:46 PM IST

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రాహ్మోత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలపై ఉండి సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు.

February 27, 2026 / 08:44 PM IST

నిధులు కేటాయించాలని ఎంపీకి వినతి అందజేత

KMM: చింతకాని మండలం చిన్నమండవ గ్రామ అభివృద్ధికి ఎంపీ లాండ్స్ నిధులు కేటాయించాలని సర్పంచ్ పర్చ రామచంద్రరావు, రామసహాయం రఘురామరెడ్డిని శుక్రవారం కలసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల, రహదారులు, డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు అవసరమని వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ, సాధ్యమైనంత నిధులు కేటాయిస్తానని తెలిపారు.

February 27, 2026 / 08:42 PM IST