MBNR: భారత ప్రభుత్వం యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ (మై భారత్), పీయూ సంయుక్తంగా “విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్” పోటీలు బుధవారం పీయూలోని లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు యువజన అధికారి కోట నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా వీసీ జీఎన్.శ్రీనివాస్ హాజరవుతున్నారని, అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు.
MNCL: సింగరేణిలో పనిచేస్తున్న అధికారులతో పాటు ప్రతి ఉద్యోగికి బొగ్గు నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలని డైరెక్టర్(ప్రాజెక్ట్ ప్లానింగ్) వెంకటేశ్వరరావు సూచించారు. మందమర్రి ఏరియా ఇల్లందు క్లబ్లో బొగ్గు నాణ్యత వినియోగదారుల అవసరాల దృష్ట్యా సింగరేణి ఎదుర్కొంటున్న సమస్యల అంశంపై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
MDCL: నూతనంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు అనంతరం వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చారు. కానీ.. జోనల్ కమిషనర్ అధికారుల పేర్లు తప్ప, వారి కాంట్రాక్టు వివరాలు, ఈమెయిల్ అడ్రస్ లాంటివి పొందుపరచలేదు. దీంతో కిందిస్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించకుంటే, జోనల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే కాంటాక్ట్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని పలువురు డిమాండ్ చేశారు.
SRPT: యాసంగి సీజన్ కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి నీటిని మంగళవారం సాయంత్రం పెంచారు. నీటిని 1,613 క్యూసెక్కుల నుంచి 1,750 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు.
SRPT: మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం సాయంత్రం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాటు పంచామృతాభిషేకం, జరిపించారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవసం వాదం చేపట్టారు.
KMM: మానసిక స్థితి సరిగా లేక బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. SI హరిత తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు కప్పలబంధం రోడ్డులో నివాసం ఉంటున్న వేనేపల్లి సత్యనారాయణ (47) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే బావిలోకి దూకి ప్రాణాలు విడిచాడు.
NZB: ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనలో రెండు నెలల పసికందు మరణించిన ఘటనను ఖండిస్తూ.. తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీలో ర్యాలీ చేపట్టి పసికందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఏఐ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు.
PDPL: ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్, రవాణా సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీ హర్ష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
WNP: అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ఉదయం వేళల్లో గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తిలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చేరువగా ఉండి సేవలు అందించాలని పేర్కొన్నారు.
BDK: అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పాత గోగులపూడి గ్రామంలో నివసిస్తున్న ఆ కుటుంబం దీనస్థితి ఇది. చుట్టూ క్రూరమృగాలు దట్టమైన అడవి జనసంచారానికి 10 కిలోమీటర్ల దూరం అయినా సరే, ఆ అడవినే నమ్ముకుని గత 15 ఏళ్లుగా ఒకే ఒక కుటుంబం జీవనం సాగిస్తోంది. దాత రమావత్ అనిష్ సుమారు 15 వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, ఇచ్చారు.
RR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో షాద్ నగర్లో మొత్తం 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు 3,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
NGKL: రంగాపూర్ హజ్రత్ నిరంజన్ షావలి దర్గాలో నూతన సమఖానా భవనం నిర్మించాలని దర్గా కమిటీ ఛైర్మన్ రఫీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మత్ ఉల్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
RR: ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ రాఘవేందర్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని బదిలీ ఉత్తర్వులు మూడు వారాల క్రితమే పంపగా.. ఉత్తర్వులు తీసుకోకుండా కాలయాపన చేశారు. ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో నూతన వైద్యుడిగా డాక్టర్ రఘురాంను నియమించగా.. ఆయన నిన్న ఆసుపత్రిలో రిపోర్ట్ చేశారు .
NRPT: జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్లి కచ్చితమైన ఓటరు గుర్తింపుతో ప్రోసిడింగ్ మ్యాపింగ్, ఎలక్టోరల్ మ్యాపింగ్ చేపట్టాలని వారం రోజుల్లో ఈ ప్రక్రియను 80 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటరు నమోదు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు.
KNR: భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూపు కీలకమని, ఆర్టీసీ, ఆటో, ఇతర వాహన డ్రైవర్లు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గల అస్త్ర కన్వెన్షన్ హాల్లో వినియోగించుకోగలరు.