WGL: నర్సంపేట మినీ స్టేడియంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 303,అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది నూతన శ్రీ పరాభవ నామ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వం వహించారు. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు నాంది పలికే పండుగ అని ఆయన పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. 100 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అష్వాక్ అలీ డిమాండ్ చేశారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, వంటి మౌలికసదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
నిర్మల్ పట్టణానికి రింగురోడ్డు ఆవశ్యకత ఎంతో అవసరం ఉంది. జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో జిల్లా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మల్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పడినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న ప్రధాన కార్యాలయాలకు ఈ రింగ్ రోడ్డు ఎంతో ఉపయోగం కానుంది.
PDPL: RGM సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర గల దుకాణ సముదాయంలో అద్దెపై లబ్ధిదారుల ఎంపిక గురించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. SC నిరుద్యోగ యువత సొంత పెట్టుబడితో జీవనోపాధి కొరకు వ్యాపారం ప్రారంభించేందుకు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని SC కార్పొరేషన్ రూమ్ నెంబర్ 225లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
SRCL: కోనరావుపేట మండలంలోని నాగారం ప్రభుత్వ పాఠశాల సుద్దాల రుసివాని విద్యానికేతన్ విద్యార్థులు నవోదయ పాఠశాలకు ఎంపికయ్యారు. సుద్దాల పాఠశాలకు చెందిన మంగళగిరి జయ కేశవ్, పేనుగంటి మను శ్రీ, ఎర్రబెల్లి చైత్ర, నాగారం పాఠశాల చెందిన మేండే దివ్యలు ఎంపిక కాగా డీఈవో జగన్మోహన్ రెడ్డి, ఎంఈవో మురళి నాయక్, కరస్పాండెంట్ దాసు, హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
MHBD: ఎలాంటి అనుమతులు లేకుండా పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లను స్థానిక తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లయితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
VKB: దుద్యాల్లోని రైతు వేదికలో ఎస్ఎమ్ఎమ్ 2025-26 పథకంలో మంజూరైన 7 రోటవేటర్లను లబ్ధిదారులకు అందించారు. దుద్యాల మండల వ్యవసాయ అధికారి నాగరాజు తైవాన్ స్పేయర్స్ సీడ్ డ్రిల్స్ కల్టివేటర్స్ వంటివి రైతులకు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఏఈవోలు భావన, జ్యోతి ఉన్నారు.
JGL: మల్యాల మండలంలోని రైతులు యాసంగి రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని AO చంద్ర దీపక్ తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్త పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన రైతులు దరఖాస్తు ఫారంతో పాటు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు చెందిన జిరాక్స్ కాపీలను మండల వ్యవసాయ కార్యాలయంలో అందజేయలన్నారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల ద్వారా ప్రజల జీవితాల్లో సంతోషం పెరగాలని, ఈ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
NLG: వసంతం రావడంతో తెలుగు లోగిళ్లు ఉగాది పండుగకు సిద్ధమయ్యాయి. గతేడాది వింత వ్యాధితో ఎండిపోయి రంగు మారిన వేప చెట్లు, ఇప్పుడు చిగురించి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వేప పువ్వు కొరత ఉంటుందని ఆందోళన చెందిన భక్తులకు, చెట్లు నిండుగా పూత పూయడం పెద్ద ఉపశమనాన్నిస్తోంది. ఈ ఏడాది ఉగాది పచ్చడికి వేప పువ్వు పుష్కలంగా లభించనుంది.
NGKL: వెల్దండ మండలం అజిలాపూర్లో బుధవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కేశమోని కర్ణయ్యకు చెందిన ఎద్దు పొలం పక్కన ఉన్న విద్యుత్ నియంత్రిక వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ. లక్ష విలువ ఉంటుందన్నారు. తమ ఎద్దు మరణించడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. విద్యుత్ శాఖ వారు న్యాయం చేయాలని, ఆదుకోవాలని కోరారు.
HYD: సురక్షితమైన ఓరల్ సెక్స్ కోసం ‘నాలుక కండోమ్'(టంగ్ స్లీవ్స్) ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. సాధారణ కండోమ్ల లాగే ఇవి లాలాజలం ద్వారా వ్యాపించే హెచ్ఐవీ, సిఫిలిస్ వంటి లైంగిక వ్యాధులను అరికడతాయి. వివిధ ఫ్లేవర్లలో లభించే ఇవి ఇన్ఫెక్షన్ల భయం లేకుండా రక్షణనిస్తాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో వీటి వినియోగం పెరుగుతోంది.
KNR: చొప్పదండి మండలం రాగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిన్న సాయంత్రం ఉపాధ్యాయులు ముందస్తు ఉగాది పండుగ సంబరాలను నిర్వహించారు. ఉగాది పండుగ ప్రాముఖ్యతను, ఉగాదిని జరుపుకుంటారనే విషయంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అనంతరం ఉగాది పచ్చడిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SDPT: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి దంపతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఘనంగా సన్మానించారు. ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం రావడం తెలంగాణకు దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. ఉద్యమ సమయంలో సిద్ధారెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని, ఆయన ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనమని హరీశ్ రావు, దేశపతి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు.
BHNG: యాదగిరిగుట్ట మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని బుధవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. వార్డులో అపరిశుభ్రత వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రజలు కౌన్సిలర్ ధనలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఛైర్పర్సన్ వాణి గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో, జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో పారిశుధ్య పనులు చేపట్టారు.