BDK: వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-నెక్కొండ మధ్య రైలు నుంచి జారిపడి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెంటయ్య (48) మృతి చెందారు. మృతుని సెల్ ఫోన్ సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జీఆర్పీ సీఐ సురేందర్ బుధవారం తెలిపారు. రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు.
NZB: జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.
KMR: ఉగాది ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. కొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు.
KMM: ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లరుపల్లికి చెందిన భవాని పీజీ పూర్తి చేసి, గత కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాకపోవడం, ఉద్యోగం వస్తుందో లేదోనన్న ఆందోళనతో నిన్న మనస్తాపం చెంది గడ్డిమందు తాగింది. పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని బోడాగుట్ట వద్ద పోలీసులు గంజాయి సేవిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. బుధవారం రాత్రి ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని. జన్ను ప్రణీత్ కుమార్, కొత్తూరు భాను ప్రసాద్, జంపాల లక్ష్మణ్, ఓ మైనర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
HNK: హన్మకొండ నగరంలో పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు సమాచారం రావడంతో బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అంబాల ప్రాంతంలో ఒక మహిళ వద్ద సుమారు రూ. 35,000 విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కేయూ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఎసీపీ టాస్క్ ఫోర్స్ మధుసూదన్ తెలిపారు.
KMR: గాంధారి మండలం మేడిపల్లిలో మత సామరస్యం వెల్లివిరిసింది. మసీదు కమిటీ తరఫున బుధవారం సాయంత్రం హనుమాన్ మాలధారులకు రామాలయంలో భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి పూజలు చేశారు. భారతదేశం సర్వమత సమ్మేళనమని, అందరూ ఐక్యంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాలధారులు, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
MHBD: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగూడ మండల కేంద్రంలోని మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు కుంజా సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
JGL: ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచి, పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ ఆదేశించారు. బుధవారం ఎంపీడీవోలు, ఏఈలు, ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. పనులు పూర్తయిన వెంటనే బిల్లులను ఆన్లైన్లో జనరేట్ చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు.
వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారద ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన ఆశలు, అభివృద్ధికి నాంది పలికే పర్వదినమని పేర్కొంటూ ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.
SRPT: సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి వంతుల వారీగా నీరు విడుదల చేస్తున్నారని, అయితే ఆ నీరు చివరి ఆయకట్టు వరకు చేరడం లేదని వాపోయారు.
SRCL: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం, బ్రిడ్జి నుంచి ఆలయం వరకు సుమారు రూ. 46 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా 11 మీటర్ల ఎత్తయిన విద్యుత్ పోల్స్ను ప్రారంభించారు. వేములవాడను మోడల్ టౌన్గా తీర్చిదిద్దుతామని, భక్తులకు, స్థానికులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.
GDWL: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలతో పశుగ్రాసాన్ని, పాల దిగుబడిని కాపాడుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. బుధవారం గద్వాల కలెక్టరేట్ ఆవరణలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1.08 లక్షల ఆవులు, గేదెలు, ఎద్దులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
NLG: పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అన్నారు. జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అన్ని రకాల అనుకూలమని కలెక్టర్ అన్నారు. బుధవారం కనగల్ మండలం నరసింహపురంలో రైతు పుండరీకం సాగు చేస్తున్న పట్టు పురుగుల పెంపకం కేంద్రాన్ని అయన సందర్శించారు.
BDK: భద్రాద్రి పుణ్యక్షేత్రంలో నేటి నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానీ ఉన్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 2 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27న సీతారాముల కళ్యాణం, 28న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.