ASF: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు గడువు పెంచడంతో రైతులు తమ పత్తిని అమ్ముకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. నేడు చివరి రోజు కావడంతో రైతులు వేగంగా పత్తిని అమ్మేందుకు తీసుకువస్తున్నారు.
CTR: నగరి మున్సిపాలిటీ దళితవాడలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో సీఐ మల్లికార్జునరావు దాడులు చేసి,పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36,900 స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా భారీ రన్టైమ్తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్టైమ్తో రానుందట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదలకానుంది.
W.G: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడాపోటీలలో క్రికెట్ ఆడుతుండగా రన్ చేస్తూ కింద పడిపోయిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు రిస్ట్ ఎముక శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చికిత్స తరువాత కోలుకుంటున్నారు. హైదరాబాద్ AIG ఆసుపత్రిలో ఆయనకు గురువారం శస్త్ర చికిత్స జరిగింది.
ELR: ఏపీ వడ్డీల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గురువారం ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం 100 మంది సాధక్ (వాలంటీర్)లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
SKLM: విజయవాడలోని శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం ఆట విడుపు’ 2వ రోజు పోటీల్లో మంత్రి అచ్చెన్నాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ, మైదానంలో సందడి చేశారు. స్టేడియం మొత్తం క్రీడా స్ఫూర్తితో కళకళలాడింది. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం అని మంత్రి తెలిపారు.
NLR: నమ్మకంగా ఉంటూనే నగదుతో ఉడాయించిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. వెంకన్నపాలెంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో మేనేజర్ కమ్ క్యాషియర్గా పనిచేస్తున్న కొలనుకుదురుకు చెందిన కుమార్ బంకులోని రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఏడాదిగా పనిచేస్తున్న అతడు నగదుతో కనిపించకుండా పోవడంతో యజమాని రాజశేఖర్ రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
CTR: కుప్పం ఇన్ఛార్జ్ ఆర్డీవోగా విజయలక్ష్మి నియమితులయ్యారు. 2018 గ్రూప్-1కు సంబంధించిన అధికారులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అప్రాధాన్య పోస్టుల్లో నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కుప్పం RDO శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో KRC డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మికి ఇన్ఛార్జ్ ఆర్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు కిరాణా దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి శుక్రవారం రెండో రోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు దుకాణంలో నిలవాల్సిన భారీ మొత్తంలో ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం గోకుల్ కిరాణా స్టోర్ యజమానికి రూ.10000 జరిమానా విధించారు.
SRD : పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఇస్నాపూర్కు చెందిన గంగారం రెండో కుమారుడు సుజనకుమార్ (8వ తరగతి) పాఠశాలకు సరిగా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో 22న ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకిని నూతనంగా ఎన్నికైన మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గురువారం కలిశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగరం అభివృద్ధిలో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించేలా తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
మెదక్ జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్గా పని చేశారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా పని చేస్తున్న ప్రతిమా సింగ్ తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా మెదక్ కలెక్టర్గా పదోన్నతిపై రానున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే ప్రతిమా సింగ్ కలెక్టర్గా ఎలాంటి మార్కు చూపిస్తారోనని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
SDPT: సిద్దిపేట టూ టౌన్ సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని కిరాణా షాపులు, టీ కొట్టుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాలు కలిగిన చాక్లెట్లు అమ్మినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అక్రమ విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.
ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, ‘బ్లాక్’ సీఈవో జాక్ డోర్సే కీలక ప్రకటన చేశారు. ఏఐ బూమ్ నేపథ్యంలో తమ కంపెనీలో 4000 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 40 శాతంగా ఉంది. ఈ నిర్ణయం చాలా కఠినమైనదని ఎక్స్లో పోస్ట్ చేశారు.
AP: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో పరువుహత్య జరిగింది. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని యువతి సోదరులు కొట్టి చంపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందున కోపంతో చెల్లెలి భర్తను దారుణంగా హతమార్చారు. సూర్యప్రకాష్ను రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్ని గంటలకే సంద్య సోదరులు దాడి చేసి హత్య చేశారు.