NLG: కొండమల్లేపల్లి వాసవి బజార్లో తాళం వేసిన నాగరాజు ఇంట్లో రూ.67,000 నగదు దొంగిలించిన నిందితుడు బాబాను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.50,000 స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ నవీన్ కుమార్, ఎస్సై రమేష్లను డీఎస్పీ అభినందించారు.
గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య విజ్ఞాన ప్రదర్శనను గురువారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. ప్రదర్శన ఏర్పాటు పట్ల వైద్య కళాశాల ప్రిన్సిపాల్ను అభినందించారు. ఎంతో విజ్ఞానదయంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తిలకించదగినదని చెప్పారు. విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిస్తుందన్నారు.
AP: వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో వైసీపీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు కూడా జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు.
TG: ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూములపై ముగ్గురు మంత్రుల కన్ను పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అని విమర్శించారు. పట్టాలు సక్రమమే అని .. కాంగ్రెస్ నేతల బుద్ది వంకర ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇళ్ల కూల్చివేతలపై చర్చిస్తామన్నారు.
అనంతపురం: అగ్రిగోల్డ్ బాధితులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ధర్మకర్తలు, అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మానకొండూర్ MLA డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. గురువారం శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించిన ప్రహారీ గోడను ప్రారంభించారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం వసూళ్ల ప్రక్రియను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి గ్రామపంచాయతీకి చెల్లించే పన్నులు ప్రధాన ఆదాయ వనరులు అని ఎంపీడీవో తెలిపారు. గ్రామంలో శుభ్రత, వీధి దీపాలు,తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఇంటి పన్ను చెల్లించాలన్నారు.
ATP: జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 20,855 మంది విద్యార్థులకు గాను 20,517 మంది హాజరుకాగా, 338 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా విభాగంలో 1,931 మందికి 1,901 మంది హాజరయ్యారని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో పలు స్మశాన వాటికలకు నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ముస్లిం యూత్ సభ్యులు తెలిపారు.
కోనసీమ: ఏపీ శాసన మండలిలో గురువారం బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని కొత్తపేటకు చెందిన బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం దుయ్యబట్టారు. సీనియర్ సభ్యుడిపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. ప్రజలు వైసీపీ పార్టీకి చరమగీతం పాడిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు.
ATP: గుంతకల్లు మున్సిపల్ నాన్ పీహెచ్ వర్కర్స్తో మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ గురువారం సమావేశం నిర్వహించారు వేసవి కాల దృశ్య సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోని ఫిల్టర్ బ్లేడ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. పట్టణంలో పైప్లైన్ లీకేజీలు, పైప్ లైన్ లలో మురుగునీరు చేరి కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
VZM: వాల్టా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పర్యావరణ వేత్త, న్యాయవాది బి. రామకృష్ణ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎస్.కోటలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సమీపంలో అనుమతులు లేకుండా కొంతమంది జెసిబితో భారీ వృక్షాలు తొలగించారని మండిపడ్డారు. అనుమతులు లేకుండా వృక్షాలు తొలగింపు విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.
PDPL: ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు రూ.20 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు.అనంతరం రూ.5 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గ్రామాభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని,నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పూరి మార్క్ మేనరిజమ్స్తో సిద్ధం చేసిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఫలితాల తర్వాత పూరి ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారట. విజయ్ సేతుపతితో పూరి చేస్తున్న సినిమా ముగిశాక ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు టాక్.
ATP: స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ పీ4 కార్యక్రమాలపై ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లాలో కీలక అభివృద్ధి సూచికల్లో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.