SKLM: బాణాసంచా తయారీ కేంద్రాలపై నిఘా ఉంచాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కాకినాడలో భారీ పేలుడు ఘటనలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి నిన్న యార్డ్ ముగిసిన వెంటనే పరిసరాలను స్వయంగా పరిశీలించారు. ఎక్కడైనా పశువులు మృతి చెందాయా అని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అదేవిధంగా యార్డులో పగిలిన తాగునీటి పైప్లైన్ను గుర్తించి, వెంటనే స్పందించి మరమ్మతులు చేయించారు. వినియోగదారులకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
E.G: సీతానగరంలో కొలువైన మావుళ్లమ్మ జాతర మహోత్సవానికి విశ్వహిందూ పరిషత్ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు భారీ విరాళం ప్రకటించారు. నిన్న గోకవరం CMD అవుట్లో రూ.10 లక్షల నగదును ఆలయ కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర సందర్భంగా అమ్మవారికి మూడు కిలోల వెండి కిరీటాన్ని చేయించేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
SDPT: కోహెడ మండలం నకిరేకొమ్ములలో కోతుల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామస్థులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. పంటలను నాశనం చేస్తూ, ఇళ్లలోకి చొరబడుతున్న కోతులను తరిమికొట్టేందుకు ఓ వ్యక్తికి ఎలుగుబంటి వేషధారణ వేయించి ఊరంతా తిప్పారు. ఎలుగుబంటిని చూసి కోతులు భయంతో పారిపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్య పరిష్కారానికి ఇది తాత్కాలిక మార్గమన్నారు.
నల్గొండ పాతబస్తీలోని షేర్ బంగ్లా ప్రాంతంలో కాముని దహన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక సంతోషి మాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం అగ్నిని వెలిగించి కామదహనం చేశారు. రంగుల పండుగకు ముందు నిర్వహించే ఈ వేడుకలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
AKP: కోటవురట్లలో మంగళవారం ఉదయం ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి రఘురాం ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూళ్లు చేశారు. ఈనెల 15వ తేదీ లోగా అందరూ ఇంటి పన్నులు చెల్లించాలన్నారు. కాగా ఇప్పటివరకు మండలంలో 50% పైగా ఇంటి పన్నులు వసూళ్లు చేసినట్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన సదరం శిబిరాల షెడ్యూల్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ విడుదల చేశారు. మార్చి 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారు స్లాట్ బుకింగ్ మెసేజ్, ఆధార్ కార్డు తీసుకుని రావాలి అన్నారు.
SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా మంగళవారం తెల్లవారుజామున లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని పూజారులు శాస్త్ర పాయంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండగ వీక్షించారు. అనంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
CTR: ప్రియురాలిపై అనుమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్వేటినగరంలో జరిగింది. పద్మ సరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్(35) ఓ మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆ మహిళపై అనుమానంతో కొందుగాని మిట్ట వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమైన పనులు చేసేటప్పుడు నలుగురి సలహాలు తీసుకోకూడదని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పారు. వివేకం లేని అల్పబుద్ధి కలవాడు, బాధ్యత లేని సోమరి, పనులను సాగదీసే దీర్ఘసూత్రుడు, కేవలం సంతోషపెట్టడానికే అబద్ధాలు చెప్పే ముఖస్తుతి పరుడు.. వీరి వల్ల పనులు పూర్తికాకపోగా అనర్థాలు జరుగుతాయని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఇలాంటి వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అని విదుర నీతి సారాంశం.
TG: హైదరాబాద్లోని ఉస్మానియా కాలేజీలో నిర్వహించే హోలీ వేడుకల్లో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పాల్గొననున్నారు. హోలీ సందర్భంగా హైదరాబాద్లో సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్లు బంద్ చేయనున్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో కలిసి శ్రీలీల మరో సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కబీర్ ఖాన్తో తెరకెక్కిస్తున్న మూవీలో శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో కార్తిక్ కిక్ బాక్సింగ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారని ఆలయ ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈవో డీవీ. రమణారెడ్డి తెలిపారు.
TPT: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో DEO కె.వి.ఎన్ కుమార్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. సోమవారం రాత్రి తిరుపతి రూరల్ భాగ్యనగరం ఎస్టీ కాలనీలోని విద్యార్థుల ఇళ్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షలకు 13 రోజులే సమయం ఉందని, ప్రతి నిమిషం విలువైనదని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.