AP: సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. హెచ్.వడ్రహట్టి గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా తల్లీకూతురు సుబ్బమ్మ, లక్ష్మీ అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ వివాదాల కారణంగానే వారంతా అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
IND vs WI మ్యాచ్ డ్రింక్ బ్రేక్ వేళ కోల్కతా మైదానంలో లేజర్ షో నిర్వహించడంపై దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మండిపడ్డారు. లేజర్ లైట్ వల్ల బ్యాటర్లకు ఇబ్బంది కలుగుతుందని, T20 WC వంటి కీలక వేదికపై మ్యాచ్ మధ్యలో ఇలాంటి వినోదం అవసరమా అని ప్రశ్నించారు. IPL టోర్నీ మధ్యలో అయితే ఓకే కానీ నాకౌట్స్లో ఇది సరికాదని సూచించారు.
ASF: కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2026’ జిల్లా స్థాయి పోటీలు మార్చి 5న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కే.శ్రీదేవి సోమవారం తెలిపారు.18 నుంచి 25 ఏళ్ల యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు-భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు అంశంపై 3 నిమిషాల ప్రసంగం చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అనుబంధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోదావరి నదిలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకున్నారు. భక్తులు తల పై కొబ్బరి, బెల్లాలు పెట్టుకుని వచ్చి స్వామి వారికి సమర్పించారు. భక్తులు శ్రద్దలతో పూజలు జరిపి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
KRNL: దేవనకొండ మండల కేంద్రంలోని దివానే మూగి తాత ఉరుసు సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్గాను ఇవాళ సందర్శించారు. దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ADB: ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. సోమవారం మండలంలోని వరూర్ గ్రామంలో తన వ్యవసాయ భూమిలో వెంకట్ రావు(60) మృతిచెంది కనిపించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసుకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.
BHPL: గత నెలలో నిర్వహించిన TCC లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షల్లో మహదేవపూర్ ZPHS ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఏడుగురు విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. చదువుతో పాటు కళాత్మక రంగాల్లో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు.
VSP: కూర్మన్నపాలెం సమీపంలో గల మంగళపాలెం జెఎన్ఎమ్ఎర్ దగ్గర టిట్కో ఇంట్లో సోమవారం యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లంబింగ్ పనులు చేయడానికి ఒడిశా నుంచి వచ్చిన అభినాష్ ప్రధాని (21) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
PDPL: గోదావరిఖని డిపో నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్రను ఈనెల 8న ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, కాంచీపురం, జోగులాంబ దర్శనాలు కల్పిస్తారు. 15న తిరుగు ప్రయాణం. టికెట్ ధర రూ.10,000. వివరాలకు 7382847596ను సంప్రదించాలని సూచించారు.
KDP: పొద్దుటూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థి తలారి నరసింహులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డీఈవో శంషుద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ బ్రహ్మయ్యను విచారించారు. ఘటనకు గల కారణాలను అడిగారు. అనంతరం మార్చురీకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు.
MNCL: పాత గోడ కూలి వ్యక్తి గాయపడిన సంఘటన లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లిలో జరిగిందని 108 టెక్నీషియన్ మునిందర్ గౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన నాయనాల రాజయ్య బుధవారం పశువుల కొట్టం ప్రహరీ గోడ వద్ద పనిచేస్తుండగా గోడ కూలిపోయింది. దీంతో రాజయ్య కాలుకు తీవ్ర గాయమైంది.108 సిబ్బంది టెక్నిషియన్ మునిందర్ గౌడ్, పైలట్ శ్రీనివాస్ చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
KTM ఇండియా RC 160 బైక్లో ‘ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మ్యాట్’, ‘సిరామిక్ వైట్ మ్యాట్’ అనే రెండు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. పాత ధర రూ.1.85 లక్షలకే ఇవి లభిస్తాయి. 164.2cc ఇంజన్, ఆల్-ఎల్ఈడీ లైటింగ్, ఎల్సీడీ క్లస్టర్ వంటి ఫీచర్లలో ఎలాంటి మార్పు లేదు. యమహా R15 తో పోటీ పడుతున్న ఈ బైక్, దానికంటే సుమారు రూ.19,000 ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది.
గద్వాల మున్సిపాలిటీలో 14వ వార్డు (గంజిపేట) సమస్యలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని బీఆర్ఎస్ నేత రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వార్డులో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా.. బాత్రూమ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొని అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ADB: తలమడుగు మండలంలోని పల్సి (బి) తాండ గ్రామానికి చెందిన రాథోడ్ నరేందర్ భార్య అశ్విని ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరి వెంట మండల BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.