E.G: మార్చి నెల NTR సామాజిక భరోసా పెన్షన్ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. అర్హులైన వృద్ధులు , వికలాంగులు, వితంతువులకు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి తారీకు ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28న తారీఖున లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
TG: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న ఉదయం వేములవాడ రాజరాజేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మార్చి 3న ఉదయం ప్రాతఃకాల పూజ అనంతరం రాజన్న ఆలయంతోపాటు అన్ని అనుబంధ దేవాలయాలను మూసివేస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మ.3:30కు ప్రారంభమై పాక్షిక చంద్రగ్రహణం సా.6 గంటలకు ముగుస్తుంది.
WGL: జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను నిన్న సాయంత్రం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యే మంత్రికి వివరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.
PPM: సీతంపేట మండలంలోని ఇప్పగూడ మరో ముస్తాబు గ్రామంగా సిద్దమైంది. ప్రస్తుతం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ‘గ్రామ ముస్తాబు’ పనుల్లో భాగంగా వీధులన్నీ శుభ్రం చేస్తూ, భవన ప్రారంభోత్సవానికి గ్రామస్థులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు స్పూర్తి, ప్రోత్సాహం ఆలోచనలతో ఆ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
SDPT: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ తెలిపారు. అభ్యర్థులు హల్ టికెట్స్ని tsstudycircle.co.in నుంచి డౌన్లోడ్ చేయాలని తెలిపారు. మార్చి 1న స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందన్నారు.
ఆస్ట్రేలియా వుమెన్స్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే ఓడిన నేపథ్యంలో.. సిరీస్ను కాపాడుకునేందుకు హర్మన్ సేన ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది.
SRD: తెల్లాపూర్ అంబేడ్కర్ కాలనీ హనుమాన్ దేవాలయం వద్ద కారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహ్మద్ ఖాన్ (33), మహ్మద్ ఓవైజ్ (23)ల నుంచి 2.5 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్, అఫ్జగంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. ఈ ఆపరేషన్లో ఏడుగురు రవాణాదారులు, ఒక స్థానిక విక్రేతను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 16 లక్షల విలువైన 23 కేజీల గంజాయి, ఒక బైక్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
VKB: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ స్వర్గీయ తోకని శ్రీనివాస్ విగ్రహావిష్కరణ మహోత్సవం రేపు దాదాపూర్లో జరగనుంది. మాతృభూమి సేవలో అమరుడైన ఈ వీరుడికి సముచిత గౌరవం కల్పిస్తూ గ్రామస్థులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. దేశం కోసం సర్వస్వం ధారపోసిన జవాన్ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.
TG: గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు పంపుతానని ప్రామిస్ చేశారని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. డబ్బుల కోసం పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్ముతున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చుతున్న CM రేవంత్ తన రెండో ప్యాలస్, భట్టి విక్రమార్క మూడో ఇల్లు కట్టుకుంటున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వం కాదని, రియల్ ఎస్టేట్ కంపెనీ అని ధ్వజమెత్తారు.
NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ నల్గొండకు రానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు నిర్వహించే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్లో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వివరించారు. సకాలంనకు కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.
PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కబ్రస్తాన్, ఈద్గాహ్ స్థలంలో రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీని కలిసి గురువారం కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు ముస్లిం మైనారిటీ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రార్థనలు చేసుకునేందుకు సదుపాయాలు, శుభ్రత, నిర్వహణలో అధికారులు సహకారం అందించాలన్నారు.
HNK: ఆర్ఈసీ ప్రస్తుత నిట్ కళాశాలలో 1978లో వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ) వేడుకల ప్రస్థానం మొదలైంది. 47 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రఖ్యాత కళాశాలల నుంచి విద్యార్థులు ఇందులో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటారు.
మాజీ సైనికులు, అగ్నివీరులకు అండగా నిలిచేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సేవలో రిటైర్డ్ అయిన సైనికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో భారత సైన్యంతో ఒక కొత్త సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, తక్షణమే 5,000 మందికి పైగా మాజీ సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో ‘పాయింట్స్మెన్’గా నియమించుకోనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.
CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమగ్ర సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.