TG: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న ఉదయం వేములవాడ రాజరాజేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మార్చి 3న ఉదయం ప్రాతఃకాల పూజ అనంతరం రాజన్న ఆలయంతోపాటు అన్ని అనుబంధ దేవాలయాలను మూసివేస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మ.3:30కు ప్రారంభమై పాక్షిక చంద్రగ్రహణం సా.6 గంటలకు ముగుస్తుంది.