• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లిక్కర్ కేసు.. వెలుగులోకి కీలక అంశాలు

AP: లిక్కర్ కేసులో A7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆర్థిక లావాదేవీల్లో అవినాష్ కీలక పాత్ర పోషించారు. లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు. కొత్త బ్రాండ్లు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. APBCLను అవినాష్ నడిపించారు. రూ.21 కోట్ల నకిలీ బిల్లులు సృష్టించారు’ అని సిట్ అధికారులు వెల్లడించారు.

February 26, 2026 / 07:50 PM IST

టెన్త్ విద్యార్థులకు నగదు బహుమతికి హామీ

NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHSలో ఎన్పీ ఫౌండేషన్ పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతిని ప్రకటించారు. ఫౌండేషన్ ఛైర్మెన్, సెక్రెటరీ తన్నీరు నిర్మలాదేవి, రాం ప్రభు విద్యార్థులకు ఇవాళ రాత సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రంలో హెచ్‌ఎం రమాదేవి, నర్సింగ్ రాజు, చిట్టిబాబు పాల్గొన్నారు.

February 26, 2026 / 07:47 PM IST

రూ.151 కే భద్రాచలం తలంబ్రాలు

NZB: భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు.

February 26, 2026 / 07:47 PM IST

రిటైర్మెంట్ వరకూ ఒకేలా ఉండాలి: రేవంత్

TG: గ్రూప్ 1,2 ఉద్యోగుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఎంత కష్టపడ్డారో.. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా అలాగే ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న గరం, నరం, భేషరం అనే నానుడి తప్పు అని ప్రూవ్ చేయాలన్నారు. ఉద్యోగంలో చేరనప్పటి నుంచి రిటైర్మెంట్ వరకూ ఒకేలా పనిచేయాలన్నారు.

February 26, 2026 / 07:47 PM IST

మాజీ సర్పంచిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

PPM: సీతానగరం మండలం కృష్ణరాయపురం గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడును మాజీ ఎమ్మెల్యే జోగారావు గురువారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణంతో విశాఖపట్నంలో చికిత్స పొంది స్వగ్రామానికి విచ్చేసిన ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

February 26, 2026 / 07:47 PM IST

మహబూబాబాద్‌లో మెగా ఫ్రెయిట్ డిపోకు వినతి

MHBD: మహబూబాబాద్ పట్టణంలో రైల్వేమెగా ఫ్రెయిట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని సాధన కమిటీ ప్రతినిధులు నేడు సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మల్లాడిని కలిసి విజ్ఞప్తి చేశారు. డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపాదనలను రైల్వే బోర్డు ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు.

February 26, 2026 / 07:46 PM IST

ఒక్కటైన తెలుగు అబ్బాయి.. జపాన్ అమ్మాయి..!

SRPT: ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి పీటలెక్కింది. మేళ్లచెరువుకు చెందిన వరగాని రాజేశ్ సాఫ్ట్‌వేర్. ఉద్యోగ రీత్యా జపాన్ వెళ్లి, అక్కడ టోక్యోకు చెందిన వకానాతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో బుధవారం ఖమ్మంలో వీరు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, విదేశీ వధువు మన సంస్కృతిలో మెరిసిపోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

February 26, 2026 / 07:46 PM IST

అప్పటి GHMC యాప్.. ఇప్పుడు My CURE

HYD: అప్పటి GHMC యాప్, ఇప్పుడు My CURE యాప్ అయింది. ఈ యాప్ జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సేవలు అందించడానికి ఉపయోగించేలా రూపొందించారు. My CURE అంటే మై కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ఈ పేరు పెట్టారు. మూడు కార్పొరేషన్ల ప్రజలు ఈ యాప్ యూజ్ చేసుకుని ఫిర్యాదు చేయాలని సూచించారు.

February 26, 2026 / 07:45 PM IST

‘శతశాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి’

AKP: పంచాయితీ సిబ్బంది శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని నర్సీపట్నం డీఎల్డీవో నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం పాయకరావుపేట పట్టణంలో సిబ్బంది అధికారులతో కలిసి పలు షాపుల వద్దకు వెళ్లి ఇంటి పన్నులు వసూళ్లు చేశారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో 12 మండలాల్లో వివిధ పన్నుల రూపంలో రూ.17 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 58% వసూళ్లు చేశామన్నారు.

February 26, 2026 / 07:45 PM IST

ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్

మార్కాపురం రెవెన్యూ డివిజన్ (ఆర్డీవో)గా పెంచల ప్రభాకర్ గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవిన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు..

February 26, 2026 / 07:44 PM IST

ప్రైవసీ డిస్‌ప్లేతో శాంసంగ్ S26 అల్ట్రా.. ధర ఎంతంటే?

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ S26 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ S26 అల్ట్రాతో పాటు S26, S26+ మోడళ్లను తీసుకొచ్చింది. గెలాక్సీ S26 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్5, 5000mAH బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. S26 అల్ట్రా (12GB+256GB వేరియంట్) ప్రారంభ ధర రూ.1,39,999, 12GB+512GB వేరియంట్ ధర రూ.1,59,999, 16GB+1TB వేరియంట్ ధర రూ.1,89,999గా నిర్ణయించారు.

February 26, 2026 / 07:43 PM IST

‘ఆరోగ్య సేవలపై ప్రజా అభిప్రాయం మెరుగుపడాలి’

నంద్యాల జిల్లాలో వైద్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ జీ. రాజకుమారి వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి సమయానికి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

February 26, 2026 / 07:43 PM IST

బాధితుడి చెంతకే పోలీస్.. ఆసుపత్రిలో కేసు నమోదు..!

సూర్యాపేట: ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని సూర్యాపేట పోలీసులు నిరూపించారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుడెల్లి రంగా వద్దకు ఎస్సై మహేంద్రనాథ్ స్వయంగా వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు లింగయ్యపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉన్న బాధితులకు తక్షణమే స్పందించి న్యాయం చేస్తామని ఎస్సై అన్నారు.

February 26, 2026 / 07:43 PM IST

రేపు దమ్మపేటలో ఎమ్మెల్యే పర్యటన

BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రేపు దమ్మపేట మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి వట్టి వెంకట్రావు నేడు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్ హెచ్ జి భవన శంకుస్థాపన, జిపిఎస్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన, అంగన్వాడి భవనం ప్రారంభోత్సవం, సిసి రోడ్డు శంకుస్థాపన, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.

February 26, 2026 / 07:43 PM IST

ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించిన ఎంపీ

NTR: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ స్టేట్ టెలిస్టులేటివ్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని ఈరోజు హాజరై క్రీడలు ఆడుతున్న ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో క్రికెట్ పోటీలు నిర్వహించాలనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆలోచన రాబోయే కాలంలో లెజిస్లేటివ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పునాది కావాలని ఆకాంక్షించారు.

February 26, 2026 / 07:42 PM IST