AKP: పంచాయితీ సిబ్బంది శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని నర్సీపట్నం డీఎల్డీవో నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం పాయకరావుపేట పట్టణంలో సిబ్బంది అధికారులతో కలిసి పలు షాపుల వద్దకు వెళ్లి ఇంటి పన్నులు వసూళ్లు చేశారు. నర్సీపట్నం డివిజన్ పరిధిలో 12 మండలాల్లో వివిధ పన్నుల రూపంలో రూ.17 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 58% వసూళ్లు చేశామన్నారు.