BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అరుంధతి నగర్లో సుమారు రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న OHSR వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే నిర్మాణం నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సంఘం సభ్యుడు శ్రీనివాసులు కుమారుని వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
CTR: సంజీవని ప్రాజెక్ట్ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.
CTR: సంజీవని ప్రాజెక్ట్ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.
అన్నమయ్య: గాలివీడులో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదాలు అన్నదమ్ముల మధ్య వర్గ పోరే ఈ హత్యకు కారణమని DSP కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. పొద్దుటూరుకు చెందిన కులాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాథరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
GNTR: కొల్లిపర మండలం అత్తోట సమీపంలోని కుంచవరం అడ్డరోడ్డు వద్ద గల పంట పొలాల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. మృతదేహం కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు.
SKLM: ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న తీరును సీఐ ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. శుక్రవారం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని నిబంధనలను మితిమీరితే కేసులు పెట్టడం తప్పదని హెచ్చరించారు.
అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. రక్తపోటును నియంత్రించడంలోనూ ఇవి కీలకం. వీటిని పొడి రూపంలో రోజూ తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ప్రకాశవంతంగా మారుతాయి.
AP: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 రకాల సేవలు అమలు చేసినట్లు మంత్రి లోకేష్ అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్కు AIని జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చామని తెలిపారు. వేగంగా స్పందించడం, రసీదు రావాలనే అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సభ్యులు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, మనమిత్ర 2.0ను కూడా ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
RR: కొత్తూర్ మండల తాహసీల్దార్ రవీందర్ రెడ్డికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించింది. వరంగల్ KUDA(కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆర్డర్ కాపీని అందజేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తి తహసీల్దార్కు పదోన్నతిపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచ కప్లో భాగంగా మార్చి 1న కోల్కతా వేదికగా భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన వాతావరణ శాఖ ఆరోజు వర్షం పడే అవకాశం లేదని, 23 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని స్పష్టం చేసింది.
VKB: ధారూర్ మండల నూతన విద్యాధికారిగా (MEO) ఎం. చెన్నయ్య బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం సమగ్ర చర్యలు చేపడతానని, మండలాన్ని విద్యా రంగంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని సూచించారు.
NRML: కుబీర్ మండలంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైర్లను అపహరించారు. రాత్రి వేళ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను కిందకు పడదోసి విలువైన వైర్లు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన అమ్మవారి చల్లని చూపుతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు.
KMR: అప్పుల బాధ తాళలేక ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై మోహన్ రెడ్డి ప్రకారం.. బిచ్కుందకు చెందిన గోనె పీరయ్య(41) సంగారెడ్డి జిల్లాలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతకాలంగా మద్నూర్ మండలం చిన్న శక్కర్గలో ఉంటున్నారు. ఈనెల 25న అదృశ్యమైన ఆయన చెరువులో శవమై కనిపించారు.