• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఆత్మకూరు వాసి

WNP: ఆత్మకూరు పట్టణానికి చెందిన హిమబిందు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. అండర్-16 విభాగంలో పశ్చిమ బెంగాల్ వేదికగా ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు జరిగే పోటీల్లో ఆమె పాల్గొననుంది. జాతీయ స్థాయికి ఎంపికై పట్టణానికి పేరు తెచ్చిన హిమబిందును ఎంఈవో బాలరాజుతో పాటు పలువురు పట్టణ వాసులు అభినందించారు.

February 25, 2026 / 07:35 AM IST

దానం, కడియంకు స్పీకర్ నోటీసులు

TG: BRS పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ఈ నెల 27, 28 తేదీల్లో వీరిద్దరిని స్పీకర్ వ్యక్తిగతంగా విచారించనున్నారు. తొలుత BRS ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై, ఆ తర్వాత బీజేపీ సమర్పించిన పిటిషన్‌పై విచారణ జరగనుంది.

February 25, 2026 / 07:33 AM IST

వైద్యారోగ్యశాఖలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని డీఎంహెచ్‌వో డా. నరసింహ నాయక్ మంగళవారం తెలిపారు. మొత్తం 9 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. మార్చి 2 నుంచి 11వ తేదీ వరకూ కాకినాడ DMHO కార్యా లయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

February 25, 2026 / 07:30 AM IST

‘హత్య చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలి’

SRCL: నాగర్ కర్నూలు జిల్లాలో రజక కుటుంబానికి చెందిన పసిపాపను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రజక సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ, దిష్టిబొమ్మ దహనం దహనం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నాయకులు కోరారు.

February 25, 2026 / 07:30 AM IST

కౌతాళంలో ఆగని రాజీనామాల పర్వం

KRNL: కౌతాళంలో రాజీనామాల పర్వం ఆగడం లేదు. కుంబలనూరు, దోమలదిన్నె సర్పంచులు వీరేశ్, మమత TDP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. కష్టపడ్డ నాయకులకు నియోజకవర్గంలో సముచిత స్థానం లభించడం లేదన్నారు.

February 25, 2026 / 07:30 AM IST

నేడు రామచంద్రపురంలో జాబ్ మేళా

కోనసీమ: రామచంద్రపురంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉండి, 18-35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సుభాష్ సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

February 25, 2026 / 07:30 AM IST

బాలిక ఘాతకం.. అమ్మ, తమ్ముడి హత్య

ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఒడిశాకు చెందిన 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని, తమ్ముడిని హత్యచేసింది. అనంతరం వారి మృతదేహాలను సమీప కాలువలో పడేసింది. కొరాపుట్ జిల్లా బొరిగుమ్మలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తమ్ముడు ఈహేం పరిఢా(14) మృతదేహం లభ్యం కాగా.. తల్లి అనుష్క(45) బాడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 07:30 AM IST

నేడు జిల్లాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటన

KNR: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పెగడపల్లి మండలంలో పర్యటించనున్నారు. పెగడపల్లి కేంద్రంతో పాటు ఐతుపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ఆయన ప్రారంభించనున్నట్లు ఏఎంసీ ఛైర్మన్ రాములుగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

February 25, 2026 / 07:29 AM IST

చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి

SRPT: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగిన కాలు రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన నరసయ్య వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులు మందు తాగినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.

February 25, 2026 / 07:27 AM IST

మేడ్చల్ ఏరియాలో PLC ఇంజనీర్లకు ఫుల్ డిమాండ్

MDCL: మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆటోమేషన్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో PLC ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తయారీ యూనిట్లు, ఫార్మా కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అధిక సంఖ్యలో నిపుణులను నియమించుకుంటున్నాయి. పరిశ్రమల్లో యంత్రాల ఆటోమేటిక్ నియంత్రణ, ప్రొడక్షన్ లైన్ల మానిటరింగ్ కోసం PLC నైపుణ్యం కీలకంగా మారింది.

February 25, 2026 / 07:26 AM IST

‘జర్నలిస్టుల చలో విజయవాడ జయప్రదం చేయాలి’

VZM: వచ్చే నెల 4 న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని APWJF జిల్లా అధ్యక్షుడు కె.రమేశ్‌ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం బొబ్బిలిలో చలోవిజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు,పెన్షన్‌ మీడియా కమిషన్‌ ఏర్పాటు, వెల్ఫేర్‌ ఫండ్‌కు50 కోట్లు కేటాయింపు పరిష్కారించాలన్నారు.

February 25, 2026 / 07:25 AM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

SDPT: జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. నేటి నుంచి ఏప్రిల్ 18 వరకు జరగనున్న ఈ పరీక్షలపై CS నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.

February 25, 2026 / 07:23 AM IST

‘మట్టి పరీక్షలపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన’

MHBD: భూసార మట్టి పరీక్షలపై నెల్లికుదురు మోడల్ స్కూల్‌లోని 8, 9 తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. పంటల దిగుబడి పెంపుతో పాటు నేల ఆరోగ్యం పరిరక్షణకు మట్టి పరీక్షలు ఎంతో కీలకమన్నారు. సరైన విధానంలో మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేయడం ద్వారా రైతులు అవసరమైన ఎరువులను వాడవచ్చని తెలిపారు.

February 25, 2026 / 07:23 AM IST

దుకాణాలు తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు..!

CTR: ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను అరికట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ బ్యాగుల వాడకంపై అంక్షలు ఉన్నప్పటికీ పుంగనూరు పట్టణంలో విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది బృందాలుగా ఏర్పడి మంగళవారం పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 25, 2026 / 07:23 AM IST

‘RTC డిపోలు మూసివేయడం అన్యాయం’

PPM: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 12 RTC డిపోలు మూసివేసేందుకు సన్నాహాలు చేస్తుండడం చాలా అన్యాయమని ఏపీ PDT నేషనల్ మజ్దాూర్ యూనియన్ పాలకొండ డిపో కార్యదర్శి రాజేశ్ అన్నారు. మంగళవారం పాలకొండ డిపోవద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. విద్యుత్తు బస్సులను తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4 డిపోల మూసివేతకు ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు.

February 25, 2026 / 07:23 AM IST