PPM: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 12 RTC డిపోలు మూసివేసేందుకు సన్నాహాలు చేస్తుండడం చాలా అన్యాయమని ఏపీ PDT నేషనల్ మజ్దాూర్ యూనియన్ పాలకొండ డిపో కార్యదర్శి రాజేశ్ అన్నారు. మంగళవారం పాలకొండ డిపోవద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. విద్యుత్తు బస్సులను తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4 డిపోల మూసివేతకు ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు.