JN: జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిశారు. జనగామ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్కు ఎమ్మెల్యే వివరించి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మహిళల భద్రత, సాధికారతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా శక్తి టీమ్స్, మహిళా పోలీసులు, యువ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్ల మీదుగా సాగిన ఈ ర్యాలీల్లో మహిళా హెల్ప్లైన్ సేవలపై అవగాహన కల్పించారు.
SKLM: నరసన్నపేట మండలం కొత్తపోలవలస గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతుల కళ్ళల్లో వెలిగి నింపేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టై టిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని అన్నారు.
VKB: పెద్దేముల్ మండల పరిధిలోని మన్సాన్ పల్లి శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే కారు కుడి భాగం పూర్తిస్థాయిలో ధ్వంసమైంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పారిశుధ్య మెరుగుదలకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. చెత్త సేకరణ, పరిశుభ్రత పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని కోరారు.
VKB: దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వికారాబాద్ పట్టణంలోని గరీబ్నగర్ కాలనీలో రాత్రి 2:45 నిమిషాలకు దొంగతనానికి వచ్చిన వ్యక్తిని కాలనీ వాసులు పట్టుకుని వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NZB: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శ్రీపాదరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ (ఎల్బీ), మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, DRDO సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
BDK: పదవి విరమణ పొందిన పాల్వంచ నవభారత్ కర్మాగారం విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్వాల సతీమణి, 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ని నవభారత్ విశ్రాంత కార్మికులు సోమవారం ఘనంగా సన్మానించారు.
MBNR: ఉదండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. నష్టపరిహారం ఆరు నెలల్లో ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, తొమ్మిది నెలలు గడిచినా స్పందించకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో భారీ ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుమతి కోరుతూ సీఐ కమలాకర్కు ఇవాళ వినతి పత్రం అందజేశారు.
AKP: పాయకరావుపేట మండల సర్వసభ్య సమావేశం ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ఈ మేరకు సర్పంచులు ఎంపీటీసీలకు ఆహ్వానాలు పంపించామన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలన్నారు.
PPM : పార్వతీపురం, కృష్ణపల్లి పంచాయతీలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కృష్ణపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు అక్రమ కట్టడాలకు సంబంధించిన వివరాలను ప్రజలు వివరించారు. వెంటనే నోటీసులు ఇప్పించి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
AKP: గొలుగొండ మండలం సిహెచ్. ఎర్రవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నూకరాజు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. సర్వేయర్ సత్యనారాయణ, వీఆర్వో శ్రీనివాస్ భూరికార్డుల వివరాలు రైతులకు వివరించారు. ప్రభుత్వం రైతుల భూహక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.
KDP: ప్రస్తుత రబీ సీజన్లో వేముల మండలంలో 1,875 మంది రైతులు సుమారు 7,500 ఎకరాల్లో శనగ పంట సాగు చేసినట్లు వేముల ఏవో ఓబులేసు తెలిపారు. ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయిందని, ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో ఈ-క్రాప్, ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీలు అందుతాయన్నారు.
HNK: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రశాంతంగా ముగిసింది. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మాజీ కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులు కాలంతో పాటు పరిగెత్తుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని మాజీఛైర్మన్ అన్నారు. ABSF ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరేష్, తదితరులు పాల్గొన్నారు.