• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

సత్యసాయి: అమడగూరు మండలం కొట్టువారిపల్లి వద్ద పోలీసులు బుధవారం నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏడుగురు పేకాటరాయులు పట్టుబడ్డారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డ్రోన్ కెమెరా సాయంతో నిఘా ఉంచి ఈ ఆపరేషన్ చేపట్టారు. నిందితుల నుంచి రూ. 2.54 లక్షల నగదు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 08:10 PM IST

పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

PDPL: 2027లో జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుష్కర దేశాలలో ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైట్లు, ఆలయాల అభివృద్ధి ప్రతిపాదనలు కట్టుదిట్టంగా సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

February 25, 2026 / 08:10 PM IST

రైస్ మిల్లును తనిఖీ చేసిన జేసీ రాహుల్

W.G: పాలకోడేరు(మం) శృంగవృక్షంలో శివ సాయిలక్ష్మి రైస్ మిల్లును బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రిజిస్టరు “ఎ” లో నమోదు చేసిన ధాన్యానికి, రైస్ మిల్లులో భౌతికంగా ఉన్న ధాన్యానికి ఏమైనా తేడాలు ఉన్నయా అని పరిశీలించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలని సూచించారు.

February 25, 2026 / 08:09 PM IST

‘హిందువులపై దాడులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది’

TG: హిందువులపై మజ్లిస్ నేతలు దాడులు చేస్తున్నారని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. హిందూ ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారు? అని ప్రశ్నించారు. దాడులను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్నారు.

February 25, 2026 / 08:09 PM IST

యమున నది పుష్కరాలకు ప్రత్యేక రైలు సర్వీస్

తూ.గో: వేసవి సెలవుల దృష్ట్యా IRCTC ప్రత్యేక ప్యాకేజీతో పాటు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడుపుతోందని ఏరియా మేనేజర్ ఎం రాజా వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆయన మాట్లాడారు. జూన్ 3న సికింద్రాబాద్ నుంచి అయోధ్య, కాశీ, యమున పుష్కరాలను కవర్ చేస్తూ ప్రత్యేక రైలు వెళ్లనుందని తెలిపారు. యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

February 25, 2026 / 08:07 PM IST

జిల్లా స్థాయిలో మాధవరాయుడుపాలెం విద్యార్థులు ప్రతిభ

E.G: రాజమండ్రి SKVT కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ పోటీల్లో మాధవరాయుడుపాలెం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. పద్య పఠనంలో 5వ తరగతి విద్యార్థిని తాండ్ర రేణుశ్రీ ప్రథమ స్థానం, తెలుగు వక్తృత్వంలో 9వ తరగతి విద్యార్థిని కె.జాహ్నవి ద్వితీయ స్థానం సాధించారు. బుధవారం విజేతలకు DEO కె.వాసుదేవరావు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు.

February 25, 2026 / 08:06 PM IST

పంతలచింత గ్రామంలో కార్డన్ సెర్చ్

ASR: గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు సీఐ ఎల్.హిమగిరి, డుంబ్రిగుడ ఎస్సై సురేష్ హెచ్చరించారు. బుధవారం డుంబ్రిగుడ మండలంలోని పోతంగి పంచాయతీ పంతలచింత గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా తమ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి తనిఖీలు నిర్వహించారు. అనంతరం, గ్రామస్తులతో సమావేశమయ్యారు.

February 25, 2026 / 08:06 PM IST

జిల్లా పరిషత్ హై స్కూల్‌ను సందర్శించిన డీఈవో

NTR: కంచికచర్ల మండల పరిధిలోని పెండ్యాల జిల్లా పరిషత్ హై స్కూల్‌ను DEO చంద్రకళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల బోధన విధానం, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు 100 డేస్ ప్రణాళికను కచ్చితంగా పాటించాలని సూచించారు. సమయపాలనతో చదువుకు ప్రాధాన్యత ఇచ్చి పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాలన్నారు.

February 25, 2026 / 08:05 PM IST

ఏఐ సంచలనం ‘ఆంథ్రోపిక్’ విలువ ఎంతో తెలుసా?

టెక్ రంగంలో ‘ఆంథ్రోపిక్‌’ సంచలనాలు సృష్టిస్తోంది. కొత్త ఏఐ మోడళ్లతో కంపెనీలను ఆకర్షిస్తోంది. దీంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 380 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు మార్కెట్లోకి ఆంథ్రోపిక్ కొత్త ఐటీ మోడళ్లను తెస్తుండటంతో ఇతర ఐటీ కంపెనీలు, సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు నష్టాలకు గురవతున్నాయి.

February 25, 2026 / 08:05 PM IST

సిరికొండ-కమ్మార్‌పల్లి అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు

NZB: జిల్లా సిరికొండ మండలం కమ్మార్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా (నిజామాబాద్), ఆర్మూర్ అటవీ విభాగాధికారి బీ. భవాని శంకర్, సిరికొండ ఎఫ్.ఆర్.వో నర్సింగరావు, శక్తి గంగారం, క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టారు.

February 25, 2026 / 08:05 PM IST

రేపు కోదాడకు రానున్న కేటీఆర్

SRPT: లాకప్ డెత్‌లో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం 2:00 గంటలకు కోదాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మధ్యాహ్నం లోపు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసానికి చేరుకోవాలని కార్యాలయం ఇవ్వాళ ఒక ప్రకటనలో కోరింది.

February 25, 2026 / 08:04 PM IST

అమర జవాన్ సైదా నాయక్ విగ్రహ ఆవిష్కరణ

PLD: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో ఆర్మీ జవాన్‌ బాణావత్ సైదా నాయక్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచవరం ఎస్సై కె పవన్ కుమార్ పాల్గొన్నారు. అమర జవాన్ కుటుంబ సభ్యులు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

February 25, 2026 / 08:03 PM IST

చికిత్స పొందుతూ.. వ్యక్తి మృతి

NLG: ఈ నెల 17న చిట్యాల మండలం, గుండ్రాంపల్లి శివారులో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శేఖర్ (34) ఫిబ్రవరి 17న కూలి పని కోసం భైరవునిబండ నుంచి మిత్రుడితో చౌటుప్పల్‌కు వెళుతుండగా గుండ్రాంపల్లి వద్ద బైకు అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

February 25, 2026 / 08:03 PM IST

అంబులెన్స్‌ పైలెట్లకు ‘స్టార్ పైలెట్’ పురస్కారం

ASF: జిల్లాలోని లింగాపూర్, సిర్పూర్ (యు), జైనూర్ మండల కేంద్రాల్లో 108, 102 అంబులెన్స్‌ పైలెట్లు జగదీష్, జ్ఞానేశ్వర్, రవి, గజానంద్‌లకు ‘స్టార్ పైలెట్’ పురస్కారం లభించింది. బుధవారం ఈ అవార్డులను జిల్లా కలెక్టర్ కె. హరిత,DMHO సీతారాం చేతుల మీదుగా అందుకున్నారు. అత్యవసర సేవల్లో వీరి సేవలను గుర్తించి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.

February 25, 2026 / 08:03 PM IST

ఈనెల 28 నుంచి శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

BPT: శనగ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి శనగ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. క్వింటా శనగలకు రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తున్నామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

February 25, 2026 / 08:03 PM IST