• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

త్వరలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన?

TG: మాజీ సీఎం KCR జాతీయ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఆయన ఢిల్లీ పర్యనటకు వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో CMలు స్టాలిన్, మమతా బెనర్జీలు, పినరయి విజయన్‌లతో చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో ఢిల్లీలోని BRS కేంద్ర కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నారు.

March 4, 2026 / 04:22 PM IST

‘నూతన ఐమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి’

SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో క్రాస్ రోడ్ నుంచి పాత ఊరు వరకు ఏర్పాటు చేసిన సోలార్ ఐమాస్ట్ లైట్లు కొన్ని స్తంభాలకు వేలాడుతూ, మరి కొన్ని స్తంభాలకు పని చేయకుండా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో రహదారంతా చీకటి అలుముకుని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున, అధికారులు స్పందించి వాటి స్థానంలో నూతన లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

March 4, 2026 / 04:22 PM IST

‘వైసీపీ పాలనలో కల్తీ రాజకీయాలు’

అన్నమయ్య: వైసీపీలో బడుగు బలహీన వర్గాలను విస్మరించి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాషా ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తోందని తెలిపారు.

March 4, 2026 / 04:22 PM IST

అంగన్వాడీ కేంద్రాల సమగ్ర పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

NLG: చిట్యాల మండలం ఆరెగూడెంలో బుధవారం అంగన్వాడీ కేంద్రాల సమగ్ర పర్యవేక్షణ కమిటీని ఎన్నుకున్నారు. ఛైర్మెన్ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, కన్వీనర్లుగా మురాల నవనీత, తురిమెళ్ళ కవితతో పాటు సభ్యులుగా ఉదయశ్రీ, దీప్తి, పల్లవి, సంధ్యారాణి నియమితులయ్యారు. హెచ్‌ఎం అరుణ, ఆశా వర్కర్లు పాల్గొన్న ఈ సమావేశంలో అంగన్వాడీల పనితీరును పర్యవేక్షించనున్నారు.

March 4, 2026 / 04:20 PM IST

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

KKD: తాళ్లరేవు మండలం సీతారామపురం గుడ్డివానితూము కూడలిలోని ఒక భవనంపై బుధవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఎర్రని బనియన్ ధరించి, చేతికి కడియం కలిగి ఉన్నాడు. వారం రోజుల కిందటే మృతి చెంది ఉంటాడని కోరింగ పోలీసులు భావిస్తున్నారు.

March 4, 2026 / 04:20 PM IST

లక్ష్మీపతి రెడ్డిని పరామర్శించిన శ్రీధర్ రెడ్డి

సత్యసాయి: నల్లమాడ మండలం రాగానిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్ష్మీపతి రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కదిరిలోని ఆయన నివాసానికి వెళ్లారు. లక్ష్మీపతి రెడ్డిని పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 4, 2026 / 04:20 PM IST

అపచారం చేస్తే 11 సీట్లు కూడా రావు: సోము వీర్రాజు

AP: వైసీపీ నేతలు హిందువులకు అపచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ‘రూ.620కి కల్తీ నెయ్యి కొంటే తప్పు అంటున్నారు. రూ.320కి కల్తీ నెయ్యి కొనమంటున్నారు. జగన్ ప్రభుత్వంలో 325 ఆలయాలను కూల్చేశారు. బీజేపీకి చెందిన హిందూ భక్తులపై కేసులు పెట్టారు. వైసీపీ నాయకులకు భక్తి ఉంటే చర్చలో పాల్గొనాలి. స్వామివారికి అపచారం చేస్తే 11 సీట్లు కూడా రావు’ అని విమర్శించారు.

March 4, 2026 / 04:20 PM IST

సిరికొండలో ఘనంగా లైన్‌మెన్ దినోత్సవం

NZB: జాతీయ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏఈ చంద్రశేఖర్ అధ్యక్షతన లైన్‌మెన్ దినోత్సవాన్ని సిరికొండ సబ్ స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు.

March 4, 2026 / 04:20 PM IST

ఖమ్మం టూ టౌన్ వద్ద నిలిచిన ట్రాఫిక్ సిగ్నల్స్

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గల ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం హోలీ పండుగ సందర్భంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరారు. సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో వాహనాలు అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని బాటసారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 04:17 PM IST

ఐసీసీ ర్యాంకింగ్స్: టీమిండియా బ్యాటర్ల హవా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడం విశేషం. ఇషాన్ కిషన్ 4వ స్థానంలో, తిలక్ 6వ స్థానంలో, సూర్య 7వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు, సంజూ శాంసన్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకుకు చేరుకోవడం గమనార్హం.

March 4, 2026 / 04:16 PM IST

వైసీపీ గ్రామ కమిటీల డిజిటలైజేషన్ పూర్తి

KRNL: పెద్దకడబూరు మండలంలోని 20 పంచాయతీల గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలను డిజిటలైజ్ చేసి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఇవాళ MLA బాలనాగిరెడ్డికు అందజేశారు. సుమారు 2,200 మందిని కమిటీల్లో నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు.

March 4, 2026 / 04:15 PM IST

శాసన మండలి రేపటికి వాయిదా

AP: శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభలో వైసీపీ సభ్యుల నిరసనలు, ఆందోళనల మధ్య మండలి ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

March 4, 2026 / 04:15 PM IST

‘పోటీ ఖర్చు వివరాలను అందజేయాలి’

NRML: నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను సకాలంలో అందజేయాలని సీనియర్ ఆడిటర్ చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను రసీదులతో సహా సమర్పించాలని తెలిపారు. ఖర్చుల వివరాలను సమర్పించని వారికి నోటీసులను అందజేస్తామని తెలిపారు.

March 4, 2026 / 04:15 PM IST

మాజీ సీఎంని మాజీ ఎమ్మెల్యే

PPM: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నేడు అరకు విచ్చేసిన సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని అధినేత పిలుపునిచ్చారు.

March 4, 2026 / 04:14 PM IST

ప్రశాంతంగా సాగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గణితశాస్త్రం పేపర్–IIA, వృక్షశాస్త్రం పేపర్–II, రాజకీయ శాస్త్రం పేపర్–II పరీక్షలు జిల్లాలోని 37 కేంద్రాల్లో నిర్వహించగా, మొత్తం 8,805 మంది విద్యార్థులకు గాను 8,584 మంది హాజరయ్యారని చెప్పారు.

March 4, 2026 / 04:14 PM IST