NDL: కోవెలకుంట్ల మండలంలో విద్యుత్ మోటార్లు ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీలు పెరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ నది వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం చేసి 50 కిలోల కాపర్ వైర్ ఎత్తుకెళ్లినట్లు సీఐ హనుమంతు నాయక్ వెల్లడించారు. ఈ దొంగతనాల పట్ల నిఘా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం హిందూ, కొడవ సంప్రదాయాల్లో ఘనంగా జరుగుతోంది. ఈ రోజు ఉదయం హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక ముగియగా, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారం ప్రకారం ‘కొడవ’ సంప్రదాయంలో మరోసారి వివాహం జరగనుంది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్లో నిర్వహించనున్నారు.
AKP: దేశంలోనే మొట్టమొదటి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. గురువారం శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. దీని ద్వారా లక్షలాదిమందికి ఉపాధి కలుగుతుందన్నారు. నక్కపల్లి మండలంలో వచ్చే నెల 7వ తేదీన ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద గల ఈవీఎం గోదామును కలెక్టర్ N.ప్రభాకరరెడ్ది తనిఖీ చేశారు. నెల వారీ తనిఖీలో భాగంగా ఇవాళ ఆయన గోదాములను సందర్శించారు. గోదాములకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో DRO హేమలత, తదితరులు పాల్గొన్నారు.
ATP: జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లో 2026-27 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. తొలి విడతలో 607 కార్డులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ప్రభాస్, నాగ్ అశ్విన్ల ‘కల్కి 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. HYDలోని శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న షూటింగ్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొన్నారు. వారిద్దరూ ఉదయం నుంచి రాత్రి 9 గంటలకు చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ఎక్కడా అలసట లేకుండా వారు చూపిస్తున్న డెడికేషన్కు యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారట. ఇక ఈ షెడ్యూల్ మార్చి 12 వరకు కొనసాగనుంది.
WGL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ పోర్టల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్కు ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KMM: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
SRD: కంగ్టి మండలం రాసుల్ గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు భూ హద్దుల సర్వే గ్రామసభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ముగ్నీ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి హాజరవుతున్నట్లు తెలిపారు. కావున గ్రామ ప్రజలు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
AP: నెల్లూరు నగరపాలిక మేయర్ పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అభ్యర్థిత్వానికి మరెవరూ పోటీ లేకపోవడంతో దేవరకొండ సుజాత మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి జేసీ వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ ఎన్నిక ప్రక్రియకు వైసీపీ కార్పొరేట్లు ఎవరూ హాజరుకాలేదు.
ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయనను వికారాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆసిఫాబాద్లో తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన, త్వరలోనే వికారాబాద్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధికి సహకరించాలని కోరారు.
BHPL: మల్హర్ రావు మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనుల డేంజర్ జోన్లో నివసిస్తున్న భూనిర్వాసితుల సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు తీసుకున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో సచివాలయంలో జరిగిన సమావేశంలో జెన్కో సీఎండీ ఎన్.హరీశ్ భూమి సేకరణ, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న బాధితుల్లో ఆనందం వ్యక్తమైంది.
KRNL: అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గాయపడ్డారు. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను పట్టుకునే ప్రయత్నంలో ఆయన కిందపడటంతో పాదం భాగంలో గాయమైంది. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయాన్ని గుర్తించారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయనకు గాయం కావడంతో తోటి ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
సహజమైన పూలతో చర్మ సౌందర్యాన్ని సులభంగా పెంచుకోవచ్చు. కలువ రేకులు, పాలు కలిపిన పేస్ట్ ముడతలను తగ్గిస్తుంది. గులాబీ రేకలు, శనగపిండి మిశ్రమం ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. మల్లెపూల పేస్ట్తో మర్దనా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, ఈ పూల చిట్కాలతో ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ప్రకృతి సిద్ధమైన ఈ పద్ధతులు చర్మానికి సురక్షితం.
TPT: అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలని, నగరపాలక కమిషనర్ ఎన్. మౌర్య, సిబ్బందిని ఆదేశించారు. ఒక్కొక్కరు ఒక్క టోకెన్ మాత్రమే తీసుకోవాలని సూచించారు. వచ్చేవారికి నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని తెలిపారు.