• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిల్లంచర్ల వరలక్ష్మి కన్నుమూత

SRPT: తెలంగాణ సాయుధ రైతంగ పోరాట యోధుడు, అమరజీవి చిల్లంచర్ల రఘునాథం సతీమణి వరలక్ష్మి (94) శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మునగాలలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సాయుధ పోరాట కాలం నుంచి భర్త అడుగుజాడల్లో నడిచిన వరలక్ష్మి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 05:23 PM IST

ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలపై కలెక్టర్ సమీక్ష

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెడికల్ ఆఫీసర్లు, సీడీపీఓలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.

February 27, 2026 / 05:23 PM IST

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు..!

NDL: ఆత్మకూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ షహబుదీన్ పాల్గొన్నారు. బుద్ధా రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఇవాళ పట్టణంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:22 PM IST

గుత్ప GP నూతన కార్యదర్శిగా రామ గౌడ్ బాధ్యతలు

NZB: ఆలూర్ మండలం గుత్ప GPకి బదిలీపై వచ్చిన రామ గౌడ్ శుక్రవారం నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రజల సహకారంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని రామ గౌడ్ తెలిపారు. హౌసింగ్ ఏఈ ప్రశాంత్, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శశి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:21 PM IST

మున్సిపల్ హైస్కూల్‌లో పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన

కడప: జిల్లా ఎస్‌పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీ.ఐ జీ. ప్రసాద్ రావు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. పోక్సో చట్టం, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

February 27, 2026 / 05:21 PM IST

ఉండవల్లిలో సమావేశానికి మంత్రి హాజరు..!

KRNL: ఉండవల్లి నివాసంలో కృష్ణానది ఒడ్డున నిర్వహించిన విందు సమావేశానికి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ హాజరయ్యారు. నారా లోకేష్ ఆత్మీయంగా అందరినీ పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు అందజేశారు.

February 27, 2026 / 05:21 PM IST

క్రికెట్ ఆడిన కేయూ వీసీ ప్రతాపరెడ్డి

HNK: కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను నేడు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డి సందర్శించి కాసేపు విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని వైస్ ఛాన్సలర్ అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

February 27, 2026 / 05:21 PM IST

RTC డిపోలను పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

SKLM: జిల్లా కేంద్రంలో ఉన్న 1,2 APSRTC డిపోలను జోన్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత శుక్రవారం సందర్శించారు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను మెరుగ్గా అందజేయాలని డిపో అధికారులకు ఆదేశించారు. 2 డిపోల్లో ఉన్న అన్ని సెక్షన్లను తనిఖీ చేసి సిబ్బంది అందరితో గేట్ మీటింగ్ నిర్వహించారు. బస్సులు కండిషన్లో ఉంచాలన్నారు.

February 27, 2026 / 05:20 PM IST

గ్రహణం కారణంగా సేవలు నిలిపివేత

అన్నమయ్య: మార్చి 3న జరిగే చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణ మోక్షానంతరం ఆలయ శుద్ధి, విశేష అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం, తీర్థప్రసాదం అందజేయబడుతుందని ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈఓ డి.వి. రమణారెడ్డి వెల్లడించారు.

February 27, 2026 / 05:20 PM IST

‘క్రీడల్లో యువత తమ శక్తి సామర్థ్యాలను వినియోగించాలి’

BDK: నేటి యువత క్రీడల్లో తమ శక్తి సామార్థ్యాలతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేటలో యర్రపోతు పుల్లయ్య మెమోరియల్ కప్, సంతోష్ కుమార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ, మండల స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు.

February 27, 2026 / 05:20 PM IST

విజయ్-త్రిష ప్రేమ నిజమేనా..?

TVK చీఫ్, హీరో విజయ్‌కు ఆయన భార్య విడాకుల నోటీసులు పంపించారు. అందులో ఒక హీరోయిన్‌తో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, గత కొంతకాలంగా విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారంటూ సాగుతున్న ప్రచారానికి ఈ పరిణామం బలం చేకూర్చినట్లయింది.

February 27, 2026 / 05:20 PM IST

‘కొండమల్లేపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం’

నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిని ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుస్తామని సర్పంచ్ యుగంధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వాణిజ్య, నివాస రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.

February 27, 2026 / 05:19 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

NZB: నవీపేట్ మండలం పాల్దా-జన్నెపల్లి రహదారిపై కొండూర్ కమాన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం, ఎక్సెల్ స్కూటీని ఢీకొట్టింది. బీహార్‌కు చెందిన వ్యవసాయ కూలీలు పరశురాం, హరిచరణ్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారికి 108 ఈఎంటీ నవీన్, పైలట్ మురళీ కృష్ణ ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 05:18 PM IST

సివి రామన్ స్కూల్లో స్టీమ్ ఎక్స్‌పో ప్రదర్శన

W.G: భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్టీమ్ ఎక్స్‌పో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను పదును పెట్టేంటెందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయిని అన్నారు. వేణుగోపాల్ రావు, సరిత, సుబ్రమణ్యం, రంగసాయి, పార్వతిదేవి, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:17 PM IST

పాతబస్తీలో ఐక్య రాజ్య సమితి పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్

HYD: ఐక్య రాజ్య సమితి పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్ ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్న అనితా మెండిరట్ట శుక్రవారం హైదరాబాద్ సందర్శించారు. చారిత్రాత్మక భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం పాతబస్తీలో పూసలు, గాజులు విక్రయించారు. వీటితోపాటు ఫేమస్ హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఆస్వాదించారు.

February 27, 2026 / 05:17 PM IST