• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై

కృష్ణా: పెడనలోని ఆటో డ్రైవర్లకు ఎస్సై బషీరా శుక్రవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డుపై అడ్డంగా ఆటోలను నిలిపివేయకూడదని, ప్రయాణికులను ఎక్కించడం, దించడం కోసం విశిష్ట ప్రదేశాలను మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. స్కూల్ పిక్ సమయాలలో రోడ్లపై క్రమశిక్షణ పాటిస్తూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా సహకరించాలన్నారు.

February 20, 2026 / 05:40 PM IST

మున్సిపాలిటీ సిబ్బందికి క్షయ వ్యాధిపై అవగాహన

NDL: డోన్ మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సిబ్బంది, శానిటరీ వర్కర్లకు క్షయ (టీబీ) వ్యాధిపై అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మాకాతుమ్, సూపర్వైజర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఛాతి ఎక్సరే, స్పిరోమీటర్ పరీక్షల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. కొత్త రోగులను గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని వారు తెలిపారు.

February 20, 2026 / 05:39 PM IST

రేపు వినుకొండలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..!

PLD: సీఎం చంద్రబాబు శనివారం వినుకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా వినుకొండ చేరుకుంటారు. అక్కడ ‘స్వచ్ఛ రథాన్ని’ ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

February 20, 2026 / 05:39 PM IST

నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు

SRPT: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేటలోని ప్రభుత్వ కళాశాలలో డీఐఈఓ భాను నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సీఎస్డీఓల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 05:39 PM IST

ఏసీబీ అధికారుల సోదాలు అప్డేట్

ప్రకాశం: కంభం వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ తన ఇంటిలో రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన విషయం తెలిసిందే. అయితే కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయంలోను అధికారులు సోదాలు నిర్వహించారు.

February 20, 2026 / 05:38 PM IST

ఏజీపీగా పైడి వరహా నరసింహులు నియామకం

SKLM: ఆమదాలవలస(మం) కత్యచార్యులపేటకు చెందిన పైడి వరహా నరసింహులు ఆమదాలవలస సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టులో ప్రభుత్వం న్యాయవాది(ఏజీపీ)గా సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. ఈయన పలుమార్లు ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఈయనకు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

February 20, 2026 / 05:38 PM IST

TDP నుంచి వైసీపీలో చేరిన 20 కుటుంబాలు

KDP: నందవరం మండలంలోని మాచపురం గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. టిడిపికి చెందిన 20 కుటుంబాలు శుక్రవారం వైసీపీ పార్టీలో చేరారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో పలువురు TDP గ్రామ నాయకులు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని తెలిపారు.

February 20, 2026 / 05:38 PM IST

ప్రపంచ నంబర్ వన్ కంపెనీగా అమెజాన్..!

ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అమెజాన్ అవతరించిందని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ $717 బిలియన్ల అమ్మకాలు జరపగా, వాల్‌మార్ట్ $713.2 బిలియన్ల వద్ద నిలిచింది. గత దశాబ్దంలో వాల్‌మార్ట్ కంటే 10 రెట్లు వేగంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న అమెజాన్, రిటైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.

February 20, 2026 / 05:37 PM IST

‘మహిళలపై అరాచకాలకు పాల్పడితే చర్యలు తప్పవు’

W.G: మైనర్ బాలికలు, మహిళలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేద స్పష్టం చేశారు. మహిళల రక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యమని, నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని ఆమె హెచ్చరించారు. మహిళలపై జరిగే నేరాల పట్ల ఏ మాత్రం రాజీ పడకుండా బాధ్యులపై కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.

February 20, 2026 / 05:36 PM IST

మానవత్వం చాటుకున్న ఎస్సై నరేష్

WNP: నర్సింగయ్యపల్లి డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎస్సై నరేష్ మానవత్వం చాటుకున్నారు. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అంబులెన్స్ అందుబాటులో లేని పరిస్థితిని గమనించిన ఎస్సై తక్షణమే స్పందించారు. క్షణ కాలం కూడా ఆలస్యం చేయకుండా బాధితుడిని తన బైక్ పైనే ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు.

February 20, 2026 / 05:36 PM IST

BREAKING: కల్తీ నెయ్యి.. సర్కార్ కీలక నిర్ణయం

AP: కల్తీ నెయ్యిపై విచారణకు వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. టెండర్ ప్రక్రియ.. జరిగిన లోటు పాట్లకు సంబంధించి వన్ మ్యాన్ కమిటీ అధ్యయనం చేయనుంది.

February 20, 2026 / 05:33 PM IST

మూతబడిన పీఏసీఎస్ కార్యాలయం

AKP: ఉద్యోగుల సమ్మెతో కోటవురట్ల పీఏసీఎస్ కార్యాలయం మూతపడింది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.హెచ్ఆర్ పాలసీని, జీవో36ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ వయసు 62కు పెంచాలని సమ్మెకు దిగారు.

February 20, 2026 / 05:32 PM IST

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

BPT: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 7,443 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, ప్రైవేట్ షాపుల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధరను రూ. 266.50గా నిర్ణయించామని, ఎవరైనా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

February 20, 2026 / 05:32 PM IST

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు చార్జి షీట్ వెనక్కి

HYD: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు మూడోసారి వెనక్కి పంపింది. అల్లు అర్జున్‌తో సహా 23 మందిని నిందితులుగా పేర్కొన్న ఈ పత్రాల్లో హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు వంటి కీలక సాంకేతిక ఆధారాలు జతపరచలేదని కోర్టు గుర్తించింది. ఈ సాంకేతిక లోపాలను సరిదిద్దాలని ఆదేశిస్తూ చార్జిషీట్‌ను రిటర్న్ చేసింది.

February 20, 2026 / 05:31 PM IST

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

KMM: మధిర మండలం సిరిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు కే. అప్పారావు ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:31 PM IST