TG: యాదాద్రి జిల్లాలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో వ్యాపించిన మంటల్లో కెమిస్ట్ పవన్ చిక్కుకుని మృతి చెందారు. పరిశ్రమలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తోంది.
బాబీ డియోల్ హీరోగా, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బందర్’. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్గా ఈ ఏడాది మే 22న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేస్తూ.. ‘మే 22న థియేటర్లలో కలుద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
AP: విద్యాశాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ లైబ్రరీ భవన్ నమూనాను పరిశీలించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
PDPL: బీహార్లోని బసంత్ పూర్కు చెందిన లాల్ కృష్ణ అనే యువకుడు 8 నెలల క్రితం దేశంలోని వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఇవాళ ఆయన సైకిల్ యాత్రతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం చేరుకున్నాడు. వీలైన ప్రదేశాలలో సేద తీరుతూ, ప్రతిరోజు 100 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు.
NLG: చిట్యాల పట్టణంలోని లొయోల టెక్నో స్కూల్లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా మున్సిపాల్ ఛైర్మన్ పందిరి గీత రమేష్, ఎస్సై రవికుమార్లు పాల్గొన్నారు. పాఠశాలలో ‘మాక్ కోర్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో తాత్కాలిక కోర్టు రూం వాతావరణాన్ని ఏర్పరిచారు.
KRNL: పదో తరగతి పరీక్షలను ఇబ్బందులు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల DRO డి.రామునాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నమయ్య: పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్. రాధిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. టీబీ యూనిట్ రికార్డులు, నివేదికలను పరిశీలించి చికిత్స విధానాలపై అధికారులతో సమీక్షించారు. క్షయను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు. వైద్య సిబ్బందికి వ్యాధి నిర్మూలనలో మరింత చురుకుదనం అవసరమని పేర్కొన్నారు.
ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ జయమ్మ అనే మహిళ శుక్రవారం మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గత రెండు వారాల క్రితం పాముకాటుకు గురైన జయమ్మను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
KMM: ధ్యానం శారీరక, మానసిక ప్రశాంతతకు, ఆనందానికి తోడ్పడుతుందని మధిర మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ సామినేని సుజాత అన్నారు. శుక్రవారం మాటూరుపేట గ్రామంలో నరసింహా పిరమిడ్ కేంద్రం వద్ద వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిరమిడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధ్యానాన్ని గ్రామ సర్పంచ్ చిలువేరు పూర్ణమ్మ బుచ్చిరామయ్యతో కలిసి ప్రారంభించి ప్రసంగించారు.
VZM: సీతం కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా సాగింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో నృత్య ప్రదర్శనలు గావిస్తూ విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న అన్నా నేహా అన్నాథామస్కు నటరాజ పురస్కారాన్ని ప్రదానం చేసారు. అనంతరం ఆమె నృత్య ప్రదర్శనకు ప్రేక్షకులందరూ పరవశుతులయ్యారు.
TG: గురుకుల హాస్టల్లో నియామకమయ్యే నోడల్ అధికారులు.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలి. విద్యాసంస్థల సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలను కూడా నిర్వహించాలి. తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్లోడ్ చేయాలి. తీసుకున్న చర్యల నివేదికను ప్రతినెల అయిదో తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలి.
AP: కల్తీ నెయ్యి విషయంలో సీబీఐ సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ ఛైర్మన్గా చంద్రబాబు ఉంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లను దోషులు చేసిన ఆయనే శిక్షలు వేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారం హెరిటేజ్లోనే ప్రారంభమైందని ఆరోపించారు.
ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ వద్ద భారత యువ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. భారత్-అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యువ కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. తమ చొక్కాలు విప్పి, అర్ధనగ్నంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
MBNR: క్రీడలు శారీరకదృఢత్వంతో పాటు మానసికస్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కప్ పోటీలను ఎమ్మెల్యే జ్యోతివెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధ్యాణ్యత ఇస్తుందన్నారు. యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.