• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం గుండ్లపల్లి(డిండి) మండలం దాసరినెమలిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

February 23, 2026 / 11:22 AM IST

అక్షర్‌ ఆడిన ఆ ఇన్నింగ్స్‌ని మరిచిపోయారా?: అశ్విన్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 పోరులో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో దక్షిణఫ్రికాపై అక్షర్‌ పటేల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడని, దాన్ని మరిచిపోయారా అని నిలదీశాడు. నిన్న అతడిని ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

February 23, 2026 / 11:21 AM IST

పాత బోర్డుతోనే పాట్లు.. స్థానికుల తీవ్ర ఆగ్రహం

SRPT: సూర్యాపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అధికారుల నిర్లక్ష్యం రోగులను అయోమయానికి గురిచేస్తోంది. రాజీవ్ నగర్ యూపీహెచ్‌సీ పునర్విభజనలో 23వ వార్డులోకి మారినా, బోర్డుపై మాత్రం పాత ‘21వ వార్డు’ నంబరే ఉండటం గమనార్హం. చిరునామా తెలియక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వార్డు నంబర్‌తో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

February 23, 2026 / 11:21 AM IST

నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: కేవీఆర్

TG: భూకబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. 20 ఏళ్లుగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. షబ్బీర్ అలీ అవినీతి మొత్తం బయటపెడతానని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై భూముల వివరాల కోసం RTIకి దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

February 23, 2026 / 11:21 AM IST

‘మార్కెట్ ధరతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలి’

MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు భూనిర్వాసితులు సోమవారం ఎంపీ రఘునందన్ రావును ఆయన నివాసంలో కలిశారు. మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.19 కోట్లు నిధులు కేటాయించడంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. మార్కెట్ ధరతో సమానంగా తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 11:20 AM IST

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

PLD: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక నరసరావుపేటలోని శ్రీ కాసు రాఘవమ్మా బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 11:18 AM IST

నాటు బాంబు పేలి కుక్క మృతి..!

CTR: గుడిపల్లి మండలం సాల చింతనపల్లి గ్రామ సమీపంలో అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి ఓ కుక్క మృతిచెందగా మరో కుక్కపిల్ల తీవ్రంగా గాయపడింది. కొంతమంది వేటగాళ్లు అడవి పందుల కోసం పెడుతున్న నాటు బాంబులు మూగజీవుల ప్రాణాలు తీస్తున్నాయ. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు ఎవరైనా వీటిని తాకి ఉంటే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

February 23, 2026 / 11:18 AM IST

రేపు మేడికొండూరులో మెగా జాబ్ మేళా

GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మేడికొండూరులో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సంజీవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి పీజీ (MBA, M.Com) వరకు చదువుకున్న వారు, అలాగే ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు.

February 23, 2026 / 11:18 AM IST

పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

VSP: చింతలగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. 2000-2001 బ్యాచ్ చదువుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను సత్కరించారు. ఒకరికి ఒకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సాయంత్రం వరకు ఆటపాటల్లో మునిగి తేలారు.

February 23, 2026 / 11:18 AM IST

వైసీపీ లిఫ్టుల మెయింటనెన్స్ పట్టించుకోలేదు: నిమ్మల

AP: గత పాలకులు రాష్ట్రంలోని లిఫ్టుల మెయింటనెన్స్ పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 1008 లిఫ్టుల్లో 355 అస్సలు పనిచేయడం లేదని తెలిపారు. 489 పాక్షికంగా, 158 లిఫ్టులు వందశాతం పనిచేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో లిఫ్టులతో 8 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. లిఫ్టులు పనిచేయకపోవడంతో సగానికి సాగు పడిపోయిందన్నారు.

February 23, 2026 / 11:16 AM IST

అమ్మాయిలూ.. జాగ్రత్త: సీపీ సజ్జనార్‌

TG: HYDలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై సీపీ సజ్జనార్‌ స్పందించారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే అనుమానించండి. డబ్బు డిమాండ్, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దు. ఫిర్యాదు చేయండి’ అని చెప్పుకొచ్చారు.

February 23, 2026 / 11:16 AM IST

నగరిగుట్ట మసీదు వద్ద చెత్త సమస్య

KDP: పులివెందుల నగరిగుట్ట మసీదు సమీపంలో చెత్తను వేయడంతో గాలికి అది రోడ్డుపైకి ఎగిరివస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా ఆ మార్గం ద్వారా వెళ్లే పిల్లలు చెత్తాచెదారాల కారణంగా అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. చెత్తాచెదారాలు రోడ్డుపై వ్యాపించడంతో దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.

February 23, 2026 / 11:15 AM IST

పారిశుద్ధ్య కార్మికులకు సూచనలు సలహాలు

VKB: వికారాబాద్ మున్సిపల్ ఛైర్మన్ గడ్డం అనన్య వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తెల్లవారుజామున పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన క్రీడలలో జరుగుతున్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం ఉపేక్షించేది లేదని పట్టణంలోని అన్ని ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలు చేశారు.

February 23, 2026 / 11:12 AM IST

MPTC, ZPTC .. ఎన్నికలు ఎప్పుడంటే…?

BDK: ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో ఉండనున్నారు. పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

February 23, 2026 / 11:10 AM IST

ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం

కోనసీమ: ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిద్రమత్తు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై దృష్టి సారించి అమలాపురంలో సోమవారం తెల్లవారుజామున డ్రైవర్లను ఆపి, ముఖం కడుక్కునేలా చేసి ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

February 23, 2026 / 11:10 AM IST