AKP: సంప్రదాయం మత్స్యకారులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ మత్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం పాయకరావుపేట సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు ఉన్న మత్స్యకారులను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయన్నారు. ఏ పార్టీ ఇప్పటివరకు మత్స్యకారులకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు.
KMR: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు పాల్వంచ మండలంలో పర్యటించనున్నారు. మండల కేంద్రంలోని రైతు సింగిరెడ్డి బలరాం రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న ‘ఆయిల్ పామ్ మొక్కల మాస్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన అధికారి జ్యోతి హాజరుకానున్నారు.
VZM: ఈ నెల 23 నుంచి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఈశ్వరరావు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 30 వరకు గడువు ఉందని ఆసక్తి గల విద్యార్థులు WWW.CSe.ap.gov.in/ www.apms.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పూర్తి వివరాలకు పాఠశాల పనిచేయు వేళల్లో సంప్రదించవచ్చుని పేర్కొన్నారు.
E.G: రాజానగరం మండలం పల్లకడియం గ్రామానికి చెందిన గంగలూరి పాపయమ్మకు రూ.23,400, రెక్కల చంటిబాబుకు రూ.52,723 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనసేన కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గురువారం పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం పేదలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
WNP: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆత్మకూరు వ్యవసాయ అధికారి అరవింద్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డులు, భూమి యాజమాన్య పాస్ పుస్తకం, ఆధార్ లింకు చేసిన మొబైల్ ఫోన్లో సమీపంలోని వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని ఆయన చెప్పారు.
HYD: రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.
PLD: మాచర్ల పురపాలక పరిధిలో ఈ-వ్యర్థాల సేకరణకు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుండి పార్క్ సెంటర్ వరకు ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి నెల 10, 20 తేదీల్లో ఈ సేకరణ ఉంటుందని, ప్రజలు తమ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపల్ కార్యాలయంలోని కలెక్షన్ సెంటర్లో అందజేయాలని ఆయన కోరారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక పాతూరు ఎస్సీ పాలెంకు చెందిన ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కనిగిరి ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు పలు ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుందని చెప్పింది.
KKD: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసి గురువారం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ ఈ కేసులో అనంతబాబు భార్యను A-2గా చేర్చారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది
BPT: ఉండవల్లిలోని మంత్రి లోకేశ్ నివాసంలో జరిగిన ఆత్మీయ విందులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి సతీమణికి లోకేశ్ మంగళగిరి పట్టుచీరను బహూకరించారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నేతల కలయికతో ఈ భేటీ సందడిగా సాగింది. రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత అనుబంధాలను ఈ సమావేశంలో పంచుకున్నారు.
కృష్ణా: ఉంగుటూరు గ్రామ శివారులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్ఐ యు. గోవిందు తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
GNTR: తాడేపల్లిలోని సీతానగరం బోట్ యార్డ్ వద్ద గల బకింగ్ హమ్ కాలువ సమీపంలోని చెట్లల్లో ఓ వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.మృతుడు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన తిరుమల కొండలు (45)గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను నియమించినట్లు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నియామకం పట్ల సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
KDP: సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ZP పాఠశాలలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SI అనిల్ కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి, మత్తు మందులు, గుట్కాలు ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ వివరాలను ఎవరికీ చెప్పొద్దని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు సూచించారు.