• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు రాజకీయ నేతలతో సమీక్ష

CTR: జీడీనెల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల సమీక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు తహశీల్దార్ శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని జాతీయ, రాష్ట్ర పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. బుధవారం జరగాల్సిన సమావేశం కొన్ని అనివార్య కారణాలతో నేటికి వాయిదా పడింది.

February 21, 2026 / 09:18 AM IST

షూటింగ్‌లో ఏడ్చేసిన స్టార్ హీరోలు

‘ధురంధర్’ సినిమా షూటింగ్ విశేషాలను నటుడు మాధవన్ తాజాగా పంచుకున్నాడు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని తెలిపాడు. దర్శకుడు ‘కట్’ చెప్పగానే వారిద్దరూ కంటతడి పెట్టారని మాధవన్ గుర్తుచేసుకున్నాడు. ఆ సన్నివేశాల తీవ్రత వారిని అంతలా కదిలించిందని ఆయన వెల్లడించాడు.

February 21, 2026 / 09:17 AM IST

జనన మరణాల నమోదు తప్పనిసరి

KRNL: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనన.. మరణా లను 21 రోజుల్లో నమోదు చేసుకోవాలని DMHO డాక్టర్ భాస్కర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జనన, మరణాలను 21 రోజు ల్లోపు చేసుకొంటే సేవలు ఉచితంగా, 21 నుంచి 30 రోజుల్లో చేసుకొంటే రూ.25, నెల దాటితే రూ.250, ఏడాది అయితే రూ.500 రుసుముతో పాటు అఫిడవిట్ అధికారి అనుమతి అవసరమని ఆయన చెప్పారు.

February 21, 2026 / 09:16 AM IST

మిర్చి పంట దొంగతనాలపై రైతులకు సూచనలు

ATP: రాయదుర్గం నియోజకవర్గం గోవిందవాడ, తారకాపురం మిర్చి రైతులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఇటీవల మిర్చి పొలాలలో జరుగుతున్న దొంగతనాలపై రైతన్నలకు తగు సూచనలు అందజేశారు. రాత్రి వేళల్లో ఎక్కువ సమయాల్లో రైతన్నలు తిరుగుతూ దొంగతనాలను నివారించుకోవాలని సూచించారు. తమ పోలీసు సిబ్బందిని సైతం నైట్ బీట్ నిర్వహించేలా చూస్తామని వారికి తెలిపారు.

February 21, 2026 / 09:16 AM IST

తాడిపత్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

ATP: తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత 11 రోజుల నుంచి జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా రామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఏకాంతోత్సవం జరిపారు. ముగింపు వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.

February 21, 2026 / 09:15 AM IST

మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

NLR: విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి అత్యాచారానికి యత్నించాడు. అదే సమయంలో ఆమె మామ ఇంటికి రావడంతో గోడ దూకి పారిపోయాడు. మహిళ ఫిర్యాదు మేరకు విడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 09:13 AM IST

ఉమ్మడి జిల్లాలో 7.55 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణ

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు శుక్రవారంతో ముగిశాయి. 14 కేంద్రాల ద్వారా 33 వేల మంది రైతుల నుంచి రూ.590 కోట్ల విలువైన 7.55 లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించారు. గరిష్టంగా క్వింటాకు రూ.8,110 మద్దతు ధర లభించింది. ఇప్పటికే మెజారిటీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని, చివరి దశలో అమ్మిన వారికి త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

February 21, 2026 / 09:13 AM IST

రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మిస్తాం: ఎమ్మెల్యే

W.G: తణుకులోని ప్రధాన రహదారి అయిన రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుంచి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల తణుకు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మండల, పట్టణ కమిటీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 09:12 AM IST

శ్రీశైలం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NGKL: శ్రీశైలం వెళ్తుండగా అచ్చంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో NGKL జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన పంపూరం ఆంజనేయులు (38) గాయపడి, శుక్రవారం వెల్దండ ఆసుపత్రిలో మృతి చెందారు. కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

February 21, 2026 / 09:12 AM IST

ALERT: రేపే పరీక్ష

TG: రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు, 6-9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం TGCET నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు 492 కేంద్రాల్లో ఉ.11-మ.1 గంటల మధ్య పరీక్ష జరగనుంది. నిమిషం నిబంధన ఉండే అవకాశమున్న నేపథ్యంలో విద్యార్థులు ముందగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం. మాక్ టెస్ట్ పేపర్స్, హాల్ టికెట్లు తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

February 21, 2026 / 09:10 AM IST

రేపు గురుకుల ప్రవేశ పరీక్ష: DCO

WGL: జిల్లా వ్యాప్తంగా రేపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భక్తి కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు DCO అపర్ణ తెలిపారు. విద్యార్థులు నిర్ణిత సమయంలో హాల్ టికెట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించారు.

February 21, 2026 / 09:09 AM IST

అక్రమంగా తరలిస్తున్న బియ్యం స్వాధీనం

MDK: బీహార్ నుంచి అల్లాదుర్గం మండలానికి తరలిస్తున్న అక్రమ బియ్యం లారీను అల్లాదుర్గం పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుంచి దొడ్డు రకం బియ్యం లారీల్లో రవాణా చేస్తూ మండలంలోని శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్‌కు తరలిస్తుండగా పట్టుకొని స్థానిక స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం సుమారు 42 టన్నుల వరకు ఉందని పోలీసులు తెలిపారు.

February 21, 2026 / 09:09 AM IST

దామరగిద్ద రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సూచన

NRPT: దామరగిద్ద మండలంలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ తిరుపతయ్య సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏఈవోలు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి, ఈ నెల 21 నుంచి 28 వరకు షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, దీని ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంఏవో బాలాజీ పాల్గొన్నారు.

February 21, 2026 / 09:07 AM IST

మద్యం సేవించిన ఇద్దరికి జరిమానా

KDP: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు కడప రెండో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని చిన్న చౌక్ SI రాజరాజేశ్వరి రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచామని ఎస్ఐ తెలిపారు.

February 21, 2026 / 09:05 AM IST

దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు: ఎస్సై

MNCL: దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్ తెలిపారు. నెన్నెల మండలంలోని చిత్తపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు చెల్కల భాస్కర్, మల్లక్కపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వేముల రాజేష్, శంకరి,మల్లయ్య, సంపత్ దుర్భాషలాడి దాడి చేసి చంపుతామని బెదిరించారు. భార్యభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.

February 21, 2026 / 09:05 AM IST