• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈ నెల 22న బాపట్ల జిల్లా టీడీపీ ఆఫీస్‌కు శంకుస్థాపన

బాపట్లలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బుధవారం వెల్లడించారు. ఇదే వేదికపై బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన రాజశేఖర్ బాబు ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఈ రెండు కీలక కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

February 18, 2026 / 07:04 PM IST

రేపు వేల్పూరులో వైఎస్ షర్మిల పర్యటన

PLD: ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి రానున్నారు. ఈ మేరకు వినుకొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులు వివరాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై భారం మోపుతోందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన విమర్శించారు.

February 18, 2026 / 07:01 PM IST

ప్రతి రైతుకు ఆధార్ లాంటి విశిష్ట సంఖ్య అవసరం

GNTR: ఫిరంగిపురం మండలంలోని నుదురుపాడు గ్రామాన్ని గుంటూరు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎం. పద్మావతి సందర్శించి ,రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల విశిష్ట నమోదు సంఖ్య నమోదు ప్రక్రియను పరిశీలించారు. పొలం ఉన్న రైతు ఈ నెలాఖరు లోపు రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయకుల ద్వారా ఏపీ ఎఫ్.ఆర్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

February 18, 2026 / 07:00 PM IST

‘విద్యుత్ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తాం’

KMM: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

February 18, 2026 / 06:57 PM IST

వాడపల్లి వెంకన్నను దర్శించిన మాస్టర్ శేఖర్

కోనసీమ: అత్రేయపురం(మం) పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.

February 18, 2026 / 06:52 PM IST

తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ..

MHBD: తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ఛైర్మన్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.

February 18, 2026 / 05:44 PM IST

‘పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి’

KMM: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా నేత భూక్యా వీరభద్రం బుధవారం డిమాండ్ చేశారు. నేడు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.

February 18, 2026 / 05:44 PM IST

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు

కోనసీమ: అమలాపురంలోని APSRTC బస్ డిపో వద్ద ఏవి డ్రైవింగ్ స్కూల్ నందు 12వ బ్యాచ్‌కు సంబంధించిన 16 మంది అభ్యర్థులు 32 రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు సర్టిఫికెట్లు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్లు భాస్కర్ రావు, శర్మ, అధికారులు పాల్గొన్నారు.

February 18, 2026 / 05:33 PM IST

‘క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి అవసరం’

BHPL: జిల్లా నాచారం గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై, మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగకరమని, యువతలో క్రమశిక్షణ, స్నేహభావం, జట్టు భావన పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో TRP నేతలు, క్రీడాకారులు ఉన్నారు.

February 18, 2026 / 04:49 PM IST

తాడిచెర్లలో ఫిజికల్ ట్యాలెంట్ టెస్ట్

BHPL: తాడిచెర్ల ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ లో తాడిచెర్ల ఉన్నత పాఠశాలకు చెందిన బి. సిరిచందన, శైలాని, పి. వర్దిని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

February 18, 2026 / 03:55 PM IST