KRNL: కేంద్ర భారీ పరిశ్రమలు, స్టీలు శాఖ మంత్రి హెచ్ ఢీ కుమారస్వామి రేపు మంత్రాలయం రానున్నారు. ఆయన రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 23వ తేదీన గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటునట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
కోనసీమ: ఆత్రేయపురం మండలం పూడింది గ్రామం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న పాసింజర్ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.
VZM: పెదబంటుపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ 10వ తరగతి విద్యార్థుల గృహాలకు వెళ్లి పరామర్శించారు. త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రస్తుత చదువు స్థాయిని పరిశీలించి, వారికి అవసరమైన సలహాలు, దిశానిర్దేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతోనూ చర్చించి, పిల్లలు నిరంతరంగా చదువుకునేలా అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
RR: ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర సమితి సభ్యుడుగా రెండవసారి షాద్నగర్ పట్టణానికి చెందిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం విద్యార్థి లోకానికి అండగా ఉండి పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.
ఏలూరు: నగరంలోని డివిజన్ 27, 28లలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శనివారం తంగెళ్ళమూడి-1 సచివాలయం వద్ద, FCI గోడౌన్స్ సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజల వద్ద ఉన్న ఈ- వేస్ట్ ను అందజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు తక్షణ సహాయం అందజేశారు. ఆయన ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్మక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదులు, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
BDK: అశ్వాపురం టీడీపీ సెంటర్లో శనివారం తెల్లవారుజామున మణుగూరు నుంచి అక్రమంగా మొరంపల్లి బంజరుకు ఓ వాహనములో బంధించి తరలిస్తున్న 12 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పశువులను పాల్వంచ గోశాలకు తరలించినట్లు స్థానిక సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ గురుభక్తి చాటుకున్నారు. నస్పూర్ పరిధి సీతారాంపల్లిలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయుడు జాడి శంకరయ్యకు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఓనమాలు నేర్పడంతో పాటు చిన్ననాటి నుంచి తన ఎదుగుదలకు ఉపాధ్యాయుడు శంకరయ్య పోషించిన పాత్ర మరువలేనిదని తెలిపారు.
గుంటూరు: మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల నామినల్ రోల్స్లో తప్పుల సవరణకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. గుంటూరు జోన్-3 పరిధిలోని ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ లింక్ ద్వారా వీటిని సరిచేయాలి. యూడైస్ కోడ్ ఆధారంగా విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్, మతం తదితర వివరాలను శనివారం సాయంత్రం 5 గంటల్లోపు సవరించాలని కోరారు.
ప్రకాశం జిల్లాలో శనగలు, మినుముల కొనుగోలుకు మార్క్ఫెడ్ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని జాయింట్ కలెక్టర్ నిర్మల కుమారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శనగలకు క్వింటాలుకు రూ. 5875, మినుములకు రూ.7800 మద్దతు ధర నిర్ణయించిందని ఆమె వెల్లడించారు. రైతులు ఈనెల 21వ తేదీ నుంచి రైతుసేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని ఆమె సూచించారు.
WNP: జిల్లాలో ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 13, ఇతర ప్రాంతాల్లో 12 కేంద్రాలు ఉన్నాయి. ప్రశ్నాపత్రాలను కలెక్టర్ కార్యాలయం నుంచి తరలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లలో పటిష్ట భద్రత మధ్య భద్రపరుస్తున్నారు.
BPT: బాపట్ల జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది మొత్తం 19,032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం నుంచి 9,744 మంది, రెండో సంవత్సరం నుండి 9,288 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు షర్మిల తెలిపారు. గ్రామంలోని నర్వేనంబర్ 38లోని సబ్-డివిజజన్ భూములకు రీ సర్వే ఉంటుందన్నారు. ఆ సర్వేనెంబర్లో భూములు గల రైతులు భూ సర్వేకు సహకరించాలని ఆమె కోరారు.
ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు షర్మిల తెలిపారు. గ్రామంలోని నర్వే నంబర్ 38లోని సబ్-డివిజజన్ భూములకు రీ సర్వే ఉంటుందన్నారు. ఆ సర్వేనెంబర్లో భూములు గల రైతులు భూ సర్వేకు సహకరించాలని ఆమె కోరారు.
NGKL: రాష్ట్ర పంచాయతీరాజ్ ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షుడిగా జిల్లా వాసి సుగుణాకర్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లకు గత 8 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆయన కోరారు.