• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కేటిదొడ్డి రైతులకు రబీ పంట నమోదు సూచన

GDWL: కేటిదొడ్డి గ్రామ రైతులు తమ రబీ సీజన్ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్ సూచించారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు రిజిస్టర్, పంట వివరాల నమోదు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సాయం పొందేందుకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 21, 2026 / 09:43 AM IST

కమిషనర్ పేరిట ఫేక్ కాల్స్.. ప్రజలు జాగ్రత్త

VKB: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని అధికారులు హెచ్చరించారు. 8332957830 నంబర్ నుంచి ఫోన్ చేసి, ఆస్తి పన్ను చెల్లించాలని కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నంబర్ నుంచి కాల్స్ వస్తే ఎత్తవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 09:43 AM IST

రాయదుర్గంలో వివాహిత ఆత్మహత్య

ATP: రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గంగాధర్ భార్య 50ఏళ్ల మద్దానమ్మ శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మద్దానేశ్వర స్వామి ఆలయం వద్ద బైలాటం ఆడుతుండగా భార్య ఉరివేసుకుందన్న సమాచారంతో హుటాహుటిన వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 21, 2026 / 09:43 AM IST

అదనపు కట్నం కోసం వేధించిన వ్యక్తికి రెండేళ్లు జైళ్లు శిక్ష

VSP: అదనపు కట్నం కోసం వేధిస్తున్న వ్యక్తికి భీమిలి 15వ అదనపు మెట్రోపాలిటీన్ న్యాయమూర్తి స్వాతి శుక్రవారం రెండేళ్లు జైళ్లు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 2012వ సంవత్సరంలో ఆనందంపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన నీలావతిని అదే ప్రాంతానికి చెందిన గౌరి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021లో ఆమెపై దాడి చేశాడు.

February 21, 2026 / 09:40 AM IST

కోదండరామయ్యకు స్నపన తిరుమంజన సేవ

KDP: ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి దేవస్థానంలో శనివారం శాస్త్రోక్త స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించబడింది. గర్భాలయంలోని మూలవిరాట్‌కి పంచామృతాభిషేకం చేసిన తరువాత, టీటీడీ అధికారులు సమర్పించిన కొత్త పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ఆలంకరించారు. అనంతరం అర్చకులు పూజలు నిర్వహించగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

February 21, 2026 / 09:40 AM IST

నో చెప్పిన వివాహిత.. యువకుడి ఆత్మహత్య

AP: ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లైన మహిళ వ్యామోహంలో పడి నెల్లూరుకు చెందిన అశోక్(26) అనే యువకుడు కర్నూలు(D) పత్తికొండలో ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ బిజినెస్ పేరుతో దంపతులతో పరిచయం పెంచుకున్న అశోక్, ఆ మహిళను తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఉరేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 09:40 AM IST

‘ప్రభుత్వం ఆదాని సంస్థకు వేలకోట్లను దోచిపెడుతుంది’

కృష్ణా: గుడివాడ సుందరయ్య భవన్‌లో సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను అమర్చి, ఆదాని సంస్థకు వేలకోట్లు సొమ్మును దోచిపెడుతుందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల యూనిట్ కి ఉదయం ఒక రేటు, సాయంత్రానికి రేటు నిర్ణయిస్తారని దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.

February 21, 2026 / 09:38 AM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి

PLD: శావల్యాపురం మండలం వేల్పూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యద్దనపూడి రామకోటయ్య (77) బహిర్భూమికి వెళ్లిన సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించిన స్థానికులు ఆయనను బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 09:37 AM IST

అల్లు అర్జున్ పార్టీలో రామ్ చరణ్, ఉపాసన

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్, నయనికల పెళ్లి సందర్భంగా గ్రాండ్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు నిహారిక, వైష్ణవ్ తేజ్ వంటి మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం అల్లు, మెగా హీరోల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది. 

February 21, 2026 / 09:36 AM IST

మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

PPM: జియ్యమ్మవలస మండలం పెదమేరంగి, సుభద్రవలన ప్రాంతాల పరిసరాల్లో ఏనుగుల గుంపు తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ఇవాళ వెల్లడించారు. సమీపంలోని పామాయిల్ తోటల్లో ఏనుగులు తిష్ట వేసి ఉన్నాయని తెలిపారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్లే సమయంలో ఏనుగుల కదలికలను గమనించాలని సూచించారు. ఏనుగులు ఎదురైతే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

February 21, 2026 / 09:35 AM IST

‘ఈనెల 23 నుంచి దరఖాస్తులు చేసుకోండి’

TPT: వెంకటగిరి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసి జ్యోతి ఆహ్వానించారు. ఈనెల 23వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనుండగా, మెరిట్ జాబితాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

February 21, 2026 / 09:34 AM IST

‘శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు’

KKDP: గండేపల్లి మండలంలో ఆకతాయిగా తిరుగుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న 11 మంది వ్యక్తులకు జగ్గంపేట CI శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని గండేపల్లి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌లో హాజరపరచి, సత్ప్రవర్తన కొరకు బైండోవర్ చేశామని సీఐ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా CI హెచ్చరించారు.

February 21, 2026 / 09:34 AM IST

‘అలా మాట్లాడి.. రెండు రోజులు నిద్రపోలేదు’

గతంలో తాను చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. ఆ సమయంలో అలా మాట్లాడినందుకు తాను కూడా చాలా బాధపడ్డానని, ఆ బాధతో రెండు రోజుల పాటు నిద్ర కూడా పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన మాటల వల్ల కలిగిన పరిణామాలను తలచుకుని ఎంతో మధనపడ్డానని, ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ శివాజీ ఓ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యాడు.

February 21, 2026 / 09:34 AM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 39,838 మంది

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 21, 2026 / 09:32 AM IST

మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ.. ఐద్వా నిరసన

అన్నమయ్య: మదనపల్లెలో రుషికప్రియపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ శుక్రవారం మదనపల్లిలోని స్థానిక విజయనగర్ కాలనీలో ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలని, వారికి సామాజిక మద్దతు అందించాల్సిన అవసరాన్ని నిరసనకారులు నొక్కి చెప్పారు.

February 21, 2026 / 09:31 AM IST