• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిలిచిపోయిన ఎయిరిండియా విమానం

AP: గన్నవరం- షార్జా ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికులు, ఎయిరిండియా సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. షార్జాలో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. షార్జా వెళ్లాల్సిన 163 మంది ప్రయాణికులు ఆగిపోవాల్సి వచ్చింది.

February 21, 2026 / 04:48 PM IST

కంప్యూటర్ సెక్షన్‌ను ప్రారంభించిన ఛైర్మన్

HNK: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అంధులకు(బ్రెయిలీ లిపి) వారికి కంప్యూటర్, బుక్స్ సెక్షన్స్‌ను గ్రంథాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్ ప్రారంభించారు. జిల్లాలోని అంధులకు కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో సెక్షన్స్ ప్రారంభించామని, అంధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:46 PM IST

విశాఖకు పెట్టుబడులు క్యూ కడుతున్నాయి: మంత్రి

AP: విశాఖ ప్రపంచస్థాయి నగరంగా మారుతోందని, ఇక్కడికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని, దానిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

February 21, 2026 / 04:46 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన MLA

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని MLA హరీష్ బాబు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ ని ఆసుపత్రి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషంట్ సేవలని విస్తరించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

February 21, 2026 / 04:46 PM IST

రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి: ఏఈవో

MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ప్రతి రైతుకూ ‘ఫార్మర్ ఐడీ’ తప్పనిసరని మూసాపేట మండల ఏఈవో శశిత తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఫోన్ నెంబర్ రైతు వేదికకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ఐడీ ఉంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ సాయం నేరుగా అందుతుందని స్పష్టం చేశారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 21, 2026 / 04:45 PM IST

27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

AKP: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో 27 మందికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం స్థానిక జడ్పీ అతిథిగృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వీరికి రూ.13.76 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

February 21, 2026 / 04:45 PM IST

కొలువుదీరిన కొమ్ముగూడెం సొసైటీ నూతన పాలకవర్గం

W.G: తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామం విశాల సహకార పరపతి సంఘ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం శనివారం జరిగింది. నూతన అధ్యక్షులుగా అబ్బిన వీర వెంకటరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి మాట్లాడారు. సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

February 21, 2026 / 04:45 PM IST

అంతర్గత డ్రైనేజ్ సమస్యల పరిష్కారం

BDK: మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధి,1వ వార్డు, వాగు మల్లారం గ్రామంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్గత రోడ్లు, అంతర్గత డ్రైనేజీ సమస్యలను పరిశీలించి తక్షణమే పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.

February 21, 2026 / 04:43 PM IST

‘బాల్యానికి సంకెళ్లు వద్దు.. బంగారు భవిష్యత్తు నిద్దాం’

NZB: చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న పేర్కొన్నారు. సాలూరులో పంచాయతీ కార్యదర్శులకు బాల్య వివాహాల నిరోధక చట్టం-2006పై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 21, 2026 / 04:42 PM IST

ప్రియాంక గాంధీని కలిసిన డిప్యూటీ సీఎం భట్టి

KMM: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆమెకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 21, 2026 / 04:42 PM IST

చిత్తూరులో అభివృద్ధి పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 4వ వార్డు కట్టమంచి లాయర్స్ కాలనీలో రూ. 19.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. లాయర్స్ కాలనీ ఎక్స్‌టైన్ష‌న్‌‌కు“వెంకటరమణ నగర్”గా నామకరణం చేసి ఆవిష్కరించారు.

February 21, 2026 / 04:41 PM IST

మెరిట్ ఉన్నవారికే పదవులు: రేవంత్ రెడ్డి

TG: గతంలో DCC అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే టికెట్ రానివారికి ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. పార్టీ కోసం కృషి చేసిన మరో 60 మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. పార్టీలో అందరి పని తీరు మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. మెరిట్ ఉన్న వారికి పార్టీలో కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు.

February 21, 2026 / 04:41 PM IST

YCP నేతల తీరు దుర్మార్గం: మంత్రి కొల్లు

AP: YCP నేతల తీరు దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీకి రారని.. మండలిలో సభ జరగనివ్వట్లేదని తెలిపారు. దేవదేవుడి ఫొటోలు పట్టుకుని మండలికి చెప్పులతో వచ్చారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో అన్నిరంగాల్లోనూ దోపిడీయేనని పేర్కొన్నారు.

February 21, 2026 / 04:40 PM IST

TVK పార్టీ యానాం ఇన్‌ఛార్జ్‌గా తోట రాజు

కోనసీమ: దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తోంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, పుదుచ్చేరిలోని యానాం ప్రాంతానికి ఎ. తోట రాజును పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.

February 21, 2026 / 04:40 PM IST

ఆలయ ప్రతిష్టాపనకు రావాలని ఆహ్వానం అందజేత

E.G: కడియం మండలం వేమగిరిలో నిర్మించిన శ్రీ ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపనకు ఆలయ కమిటీ పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. మంత్రి కందుల దుర్గేష్, MLAలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బల రామకృష్ణ, MLC సోము వీర్రాజు, తదితరులకు శనివారం ఆహ్వాన పత్రికలు అందించారు. ఈనెల 26న ఆలయ ప్రతిష్టాపన జరుగుతుందన్నారు.

February 21, 2026 / 04:40 PM IST