అన్నమయ్య: రామసముద్రం మండలం గంపనంపల్లికి చెందిన పవిత్ర (17) తిరుపతిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 20న జ్వరం రావడంతో పద్మావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో రుయా ఆసుపత్రికి తరలించగా.. ఇవాళ చికిత్స మృతి చెందింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అన్నమయ్య: సుండుపల్లె మండలం చిన్నగొల్లపల్లె పాత జంగంపల్లెలో జరగనున్న శ్రీ గౌరిసమేత జంగమేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, కల్యాణ మహోత్సవాలకు హాజరు కావాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ప్రసాద్ బాబును గ్రామస్తులు ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నారులు వేసిన దశావతార వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విష్ణుమూర్తి పది రూపాలను ప్రతిబింబించేలా రంగురంగుల దుస్తులతో చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో కళకళలాడింది. చిన్నారుల ప్రతిభను చూసి భక్తులు, ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 51 అర్జీలను స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
NLG: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) చేసుకోవడానికి ఈనెల 25 వరకు గడువు విధించారని ఆ యొక్క గడువును మరో 10 రోజులు పొడగించాలని కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో విజ్ఞప్తి చేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి మరో పది రోజులు గడువు పెంచాలని కోరారు.
కృష్ణా: సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న EVM గోడౌన్ను జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ తనిఖీ చేశారు. గోడౌన్ సీల్ను, ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఎన్నికల భద్రత దృష్ట్యా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.
ప్రకాశం: కంభం పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు స్థానిక ఎస్సై శివ కృష్ణారెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు నడుపుతున్న వాహనాలను స్వాధీనం చేసుకొనివాహన యజమానులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వార్నింగ్ ఇచ్చి, జరిమానా విధించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చివారు రోడ్డు ప్రమాదానికి కారణమైతే వాహన యజమానిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
KMR: ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామంలో జరిగిన భారీ దొంగతనం కేసును ఎల్లారెడ్డి పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో ఇనుప పెట్టెలో దాచిన సుమారు 40 తులాల వెండి ఆభరణాలు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.16 లక్షల నగదును దొంగిలించిన కిలాడీ దొంగల జంటను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
KNR: నాగర్ కర్నూల్లోని కొమ్మెర గ్రామంలో రజక కుటుంబానికి చెందిన ఓ పసికందు మృతికి నిరసనగా శంకరపట్నం మండల కేంద్రంలో రజక సంఘం, బీసీ సంఘాల ధర్నా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిన్నారి మృతికి కారణమైన అగ్రకుల నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అగ్ర వర్ణాల ఆగడాలను ఖండించారు. బీసీ సంఘం, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సరోగసీ పేరుతో శిశు విక్రయాలు జరిపిన కేసులో సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రతకు కోర్టు 2 రోజుల కస్టడీ విధించింది. నమ్రతను ఈడీ 5 రోజుల కస్టడీ కోరగా.. నాంపల్లి కోర్టు రెండు రోజులకు అనుమతించింది.
తూ.గో: రాజమండ్రి ఆవ వాంబే కాలనీలో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యను ఆర్ఎమ్సీ అధికారులు సోమవారం పరిష్కరించారు. డ్రైనేజీలు పూడికతో నిండి మురుగు నిలిచిపోవడంతో, స్థానికులు ‘జనతా వారధి’ వేదికలో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన అధికారులు జేసీబీలతో మురుగును తొలగించి శుభ్రం చేశారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
WGL: సైబరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీ సన్ ప్రీత్ సింగ్ క్రీడాకారులను అభినందించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పతకాలు సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించగలమన్నారు.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జనవరి 30న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 4 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కోపిష్టి ఓంకార్(తరుణ్), స్వేచ్ఛ కోరుకునే ప్రశాంతి(ఈషా)ల పెళ్లి తర్వాత వారి జీవితాల్లో ఎదురైన నాటకీయ పరిణామాల సమాహారమే ఈ మూవీ కథ.
PPM: ఫిర్యాదు చేసిన వ్యక్తి పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. మొత్తం తొమ్మిది పిర్యాదులు వచ్చాయన్నారు.
WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.