• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

KMR: కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం ఆయన డీఎంహెచ్​వోగా ఛార్జ్​ తీసుకున్నారు. అనంతరం కార్యాలయం సిబ్బందితో సమావేశం అయ్యారు. సర్వీస్​లోనే ఉంటూ 2006 నుంచి 2009 వరకు ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

February 23, 2026 / 07:06 PM IST

26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు: మంత్రి

E.G: పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా జనసేన సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు. సోమవారం హుకుంపేట కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కానుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

February 23, 2026 / 07:06 PM IST

‘వ్యవసాయ రంగానికి 50 శాతం నిధులు కేటాయించాలి’

NTR: 2026-2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కనీసం 50 శాతం నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజయానంద్‌కు విజ్ఞప్తి చేసింది. గంపలగూడెంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ.. రైతు సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.

February 23, 2026 / 07:05 PM IST

కల్తీపాల ఘటన బాధాకరం: ఆదిరెడ్డి వాసు

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటన బాధకరం అని MLA ఆదిరెడ్డి వాసు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించామని తెలిపారు. బాధితుల చికిత్స కోసం విజయవాడ నుంచి డయాలసిస్ పరికరాలు తెప్పిస్తున్నామని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడామన్నారు. చిన్నారులు, వృద్ధులపై ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. కల్తీపై మాట్లాడే అర్హత YCPకి లేదని విమర్శించారు.

February 23, 2026 / 07:04 PM IST

గంగూరులో పదిమంది అరెస్ట్

కృష్ణా: గంగూరులో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదంలో పాల్గొన్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.55,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నామని, అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

February 23, 2026 / 07:03 PM IST

‘ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు’

MNCL: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని కలక్టరేట్ లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

February 23, 2026 / 07:03 PM IST

కోతుల సమస్యను పరిష్కరించాలని వినతి

KNR: హుజురాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రెంటాల సుహాసిని పలు వార్డుల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు పట్టణంలో అభివృద్ధితోపాటు, కోతుల బెడద వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, కోతుల సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

February 23, 2026 / 07:02 PM IST

‘దేవాదుల ఘనత కాంగ్రెస్ దే’

MLG: దేవాదుల ప్రాజెక్టు మంజూరు చేసి నిర్మించినది కాంగ్రెస్ పార్టీనేనని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగా కళ్యాణి తెలిపారు. గోవిందరావుపేటలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం నిధులు కేటాయించారని పేర్కొన్నారు. విమర్శలకు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

February 23, 2026 / 07:02 PM IST

‘సంత్ గాడ్గే బాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

సత్యసాయి: సంత్ గాడ్గే బాబా ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు జి. ఎం. శేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ధర్మవరంలో గాడ్గే బాబా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్రలో ఒక వెనుకబడిన తరగతుల కుటుంబంలో జన్మించి, స్వచ్చందంగా పేదరికాన్ని స్వీకరించి గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు.

February 23, 2026 / 07:01 PM IST

కాలనీలో తాగునీటి సమస్యపై మహిళల వినతి

CTR: తవణంపల్లిలోని జొన్నగురకలలో కాలనీవాసులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ రామరాజు ఆధ్వర్యంలో కాలనీవాసులు డిప్యూటీ ఎంపీడీవో రాజశేఖర్‌కు వినతి పత్రం అందించారు. వెంటనే తాగునీటి సరఫరా మెరుగుపరచాలని ఎంపీడీవో సంబంధిత అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 07:01 PM IST

పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సత్యసాయి: పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితుల నుంచి 96 ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడిన అడిషనల్ ఎస్పీ, సమస్యలపై తక్షణమే విచారణ జరిపి న్యాయం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 07:01 PM IST

‘మాజీ ఎమ్మెల్యేను నగర బహిష్కరణ చేయాలి’

హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై జరిగిన దాడి ఘటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సోమవారం సీపీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, పీడీ యాక్ట్ నమోదు చేసి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 07:00 PM IST

‘చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోండి’

WGL: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు, డిజైనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని WGL జిల్లా చేనేత & జోలి శాఖ సహాయ సంచాలకులు వై. శ్రీకాంత్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 07:00 PM IST

రేపు జిల్లాకు కేటీఆర్ రాక

ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారన్నారు. పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులను పరామర్శించనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనన్నారు.

February 23, 2026 / 07:00 PM IST

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: ఆర్డీవో

E.G: PGRS, రెవెన్యూ క్లినిక్ అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరిష్కరించాలని RDO ఆర్. కృష్ణ నాయక్ ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన 14 అర్జీలను స్వీకరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అందిన ప్రతి ఫిర్యాదును నూరు శాతం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

February 23, 2026 / 07:00 PM IST