రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్పై అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్ను జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ మూవీకి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును మద్రాస్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ సినిమా విడుదలపై విజయ్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నటి అవికా గోర్ తల్లి కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ‘కొత్త ప్రారంభం’ అంటూ ఆమె పెట్టిన పోస్టుతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా వీటిపై అవికా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. నిజానికి ఆ వార్తలు చూసి తనకు కోపం రాలేదని, నవ్వు వచ్చిందని తెలిపింది. నిజంగానే ఓ పెద్ద గుడ్ న్యూస్ ఉందని, త్వరలోనే దాని గురించి చెబుతానని పేర్కొంది.
తమిళ హీరో దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ మూవీకి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా సెన్సార్ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీంతో ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు పార్ట్2ను మేకర్స్ ప్రకటించారు. దీనికి ‘రాజాసాబ్ సర్కస్:1935’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినిమా ఎండింగ్లో వెల్లడించారు. అయితే ఇది సీక్వెలా లేదా ప్రీక్వెలా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రకటనతో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
‘కాంతార 1’, ‘మహావతార్ నరసింహ’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో ఇవి నిలిచాయి. తాజాగా ఈ మూవీలు ఆస్కార్ అవార్డ్స్ జనరల్ ఎంట్రీలో స్థానం సంపాదించుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్, నిర్మాత, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో ఈ సినిమాలు పోటీపడనున్నాయి. ఈ మేరకు హోంబలే ఫిల్మ్స్ Xలో పోస్టు చేసింది.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ అడ్వెంచర్ హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’. ఈ సినిమా విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 25 నుంచి సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. తాను ప్రేమించే వారిని కాపాడాలనే లక్ష్యంతో హీరోయిన్ కత్తి యుద్ధాలు, వ్యూహాత్మక పోరాటాల నేపథ్యంతో ఈ సినిమా రాబోతుందట.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మూవీ ‘అఖండ 2’. 2025 డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 11 వరకు మల్టీప్లెక్స్ల్లో రూ.132, సింగిల్ స్క్రీన్లలో రూ.105 పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18 వరకు మల్టీప్లెక్స్ల్లో రూ.89, సింగిల్ స్క్రీన్లలో రూ.62 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్కు ఇవ్వాలని తెలిపింది.
ఇది మనవడు, నానమ్మ కథ. ప్రభాస్లోని కామెడీ కోణాన్ని చూపించేందుకు దర్శకుడు మారుతి ప్రయత్నించాడు. మాస్ ఆడియన్స్ కోసం చేసిన విన్యాసాలు మెప్పించలేదు. స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ ఆకట్టుకోలేదు. ప్రభాస్ నటన, సుదీర్ఘంగా సాగే పతాక సన్నివేశాలు హైలైట్. కనకరాజు పాత్రలో సంజయ్ దత్ ఆడే మైండ్గేమ్, ఆ పాత్ర హీరోకి సవాల్ విసిరే తీరు సినిమాని నిలబెట్టాయి. రేటింగ్ 2.75.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రభాస్ లుక్, యాక్టింగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. దర్శకుడు మారుతి వింటేజ్ ప్రభాస్ను చూపించారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా యేళ్లుగా మిస్ అయిన ప్రభాస్లోని కామెడీ కోణాన్ని ఇందులో చూపించారని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ మూవీకి షాక్ తగిలింది. టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం నిరారకరించింది. దీంతో సాధారణ ధరలకే టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మూవీ టీమ్ అభ్యర్థనను టీజీ సర్కార్ తిరస్కరించింది.
ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్పై TG సర్కార్ నిర్ణయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో.. HYD బాలానగర్లోని విమల్ థియేటర్లో రాత్రి 10గంటలకు ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ షోకు కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. APలో ప్రీమియర్స్ ప్రారంభంకానున్నాయి.
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ రేపు విడుదలవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ RTC X రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద అభిమానులు ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దాన్ని 2వేల కిలోల పుష్పాలతో అలకరించారు. ఈ కార్యక్రమం ఆలిండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
‘DJ టిల్లు’ సినిమా దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా ‘అనుమాన పక్షి’. ఈ మూవీలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో బ్రహ్మాజీ భాగమైనట్లు తెలుపుతూ మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ‘బ్రహ్మోస్-ది ట్రేసర్ బుల్లెట్ని కలవండి. లక్ష్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి. JAN 11న టీజర్ వస్తుంది. ఫిబ్రవరి 2026లో ఈ మూవీ రిలీజ్ కానుంది’ ...