• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఎస్పీ కార్యాలయానికి 27 పిర్యాదులు’

కోనసీమ: అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకి 27 పిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎస్పీ రాహుల్ మీనాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరితగతిన పిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 2, 2026 / 03:50 PM IST

రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

KDP: బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ సమీపంలో సోమవారం బొలెరో జీప్, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 03:40 PM IST

ఛత్రపతి శివాజీ విగ్రహా ఏర్పాటుకు ఎమ్మెల్యే కు వినతి

KRNL: నందవరం గ్రామ పంచాయతీ ఆవరణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు, యువకులు సోమవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేలా శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

March 2, 2026 / 03:40 PM IST

ఎస్పీ కార్యాలయంలో PGRSకు 45 ఫిర్యాదులు

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల వద్ద ఎస్పీ ప్రతాప్ కిషోర్ 45 ఫిర్యాదులను స్వీకరించారు. ఎక్కువగా మోసపూరిత లావాదేవీలు, భూ తగాదాలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు సూచించారు.

March 2, 2026 / 03:38 PM IST

PGRS ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

March 2, 2026 / 03:36 PM IST

సింగరకొండ రథోత్సవానికి 650 మంది పోలీసుల భద్రత

ప్రకాశం: సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం, రథోత్సవ బందోబస్తును ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించారు. ఇవాళ జరగనున్న రథోత్సవానికి ముగ్గురు DSPలు, నలుగురు CIలు, 40 మంది SIలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.

March 2, 2026 / 03:35 PM IST

అర్జీలు స్వీకరించిన జేసీ

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

March 2, 2026 / 03:34 PM IST

మందుగుండు తయారీ కేంద్రం సీజ్

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలోని శ్రీ వేమ శివ గణేష్ క్రాకర్స్ తయారీ యూనిట్‌ని సోమవారం రెవిన్యూ అధికారులు సిజ్ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాదం దృష్ట్యా తహసీల్దార్ లోకవరపు రామారావు ఆదేశాలతో మందు గుండు తయారు కేంద్రాన్ని సీజ్ చేసినట్లు వీఆర్వో సత్య నాగ శివ భాస్కర్ తెలిపారు.

March 2, 2026 / 03:31 PM IST

బాల్య వివాహ ముక్త భారత్ రథం ప్రారంభం

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ICDS డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ఇవాళ ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుందని వారు తెలిపారు. ఆడపిల్లలను చదువు ద్వారా ప్రయోజకులను చేయాలన్నారు.

March 2, 2026 / 03:31 PM IST

పిఠాపురం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 53 అర్జీలు స్వీకరణ

KKD: పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (పాడా) కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా ఎపీడీ వసంత మాధవి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి వివిధ అంశాలపై 53 అర్జీలు అందాయన్నారు. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

March 2, 2026 / 03:30 PM IST

కొడాలి నానిని ప్రజలు మర్చిపోయారు: ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయం ఎమ్మెల్యే రాము సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయనకొడాలి నాని త్వరలో తాను జైలుకు వెళుతున్నానని అర్థమయిందేమోనని, ఏ జైలు అయితే బాగుంటుందో చూసుకోవడానికి గుంటూరుకి వెళ్లారని అన్నారు. కొడాలి నానిని ప్రజలు మర్చిపోయారని, ఆయన గురించి మాట్లాడుకునేది ఏమీ లేదని తెలిపారు.

March 2, 2026 / 03:30 PM IST

‘ఊరి బడిని బతికించుకుందాం’ పోస్టర్ ఆవిష్కరణ

W.G: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షడు ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, పీ. క్రాంతి కుమార్ తెలిపారు. సోమవారం వీరవాసరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ‘ఊరి బడిని బతికించుకుందాం’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానుజరావు, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 03:30 PM IST

రాజమహేంద్రవరంలో వైభవంగా సలాలా పండుగ

E.G: రాజమహేంద్రవరం బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్వర్యంలో సోమవారం పుష్కరాల రేవులో సలాలా పండుగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజమహేంద్రవరం సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు.

March 2, 2026 / 03:20 PM IST

వినుకొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

PLD: వినుకొండ శివారు పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం వేగంగా వచ్చిన కారు, బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

March 2, 2026 / 03:13 PM IST

గిరిజన సంఘం ఆందోళన

ASR: ఉపాధి హామీ పథకం కింద వెంటనే ఉపాధి పనులు కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ లాసేరు, బల్డ్‌గడ్డ గ్రామాల్లో సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలని, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలని కోరారు.

March 2, 2026 / 03:12 PM IST