• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు

NLR: కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన కన్నె ఆనంద్ రావు (42) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కావలి రూరల్ పోలీసులు సోమవారం తెలిపారు. మృతుడు ఈ నెల 21న సిరిపురంలో గడ్డిమందు తాగడంతో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీనిపై రూరల్ ఎస్సై బాజిబాబు కేసు నమోదు చేశారు.

February 23, 2026 / 07:34 PM IST

జేసీ విష్ణు చరణ్‌ను కలిసిన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ

ATP: జిల్లా జాయింట్ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో జిల్లా అభివృద్ధి, రెవెన్యూ అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగేలా అధికారులతో సమన్వయం చేసుకుంటామని ఎంపీ తెలిపారు.

February 23, 2026 / 07:33 PM IST

పేకాట స్థావరంపై దాడులు.. అదుపులోకి 8 మంది

NLR: మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 21,910 నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

February 23, 2026 / 07:33 PM IST

‘పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి’

KDP: దేశవ్యాప్త పిలుపులో భాగంగా కడపలో భవన నిర్మాణ కార్మిక నాయకులు MRO నారాయణరెడ్డి, తాసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించి సొమ్ము విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ సెస్సును కార్మికుల సంక్షేమానికే వినియోగించి, వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేయాలని నాయకులు కోరారు.

February 23, 2026 / 07:33 PM IST

ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించిన కమిషనర్

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సంస్థ పరిష్కారం వేదికలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ప్రజల వద్ద నుండి 5 అర్జీలను స్వీకరించారు. శానిటేషన్ కు సంబంధించి 1 అర్జీ, ఆక్రమణలకు సంబంధించి 2 అర్జీలు, న్యూ డ్రైనేజ్ నిర్మాణం కోసం 2 అర్జీలు కమిషనర్‌కు అందాయి. సంబంధిత శాఖ అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.

February 23, 2026 / 07:32 PM IST

అర్జీలు నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలి: కలెక్టర్

GNTR: గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,

February 23, 2026 / 07:32 PM IST

పిఠాపురంలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

కాకినాడ: పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో నడిపే సమయంలో చేసే సాధారణ తప్పిదాలు, ప్రమాదాలకు గల అవకాశాలను వివరించారు. వేగం అదుపులో లేకుండా నడపడం ప్రాణాలకు హానికారకమని, పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని సూచించారు. నియమాలను లెక్కచేయకుండా నడిపితే జరిమానాలు, కేసులు, వాహన పత్రాలరద్దు వంటి చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

February 23, 2026 / 07:32 PM IST

‘లైంగిక దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి’

KRNL: ఆలూరులో ఎనిమిదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు లైంగిక దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఇవాళ డిమాండ్ చేశారు. నిందిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

February 23, 2026 / 07:32 PM IST

‘అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

SKLM: జిల్లా కేంద్రంలో అతిసార వ్యాధి కేసులు నమోదు కావడంతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధి ప్రభావంపై సమీక్షించిన అనంతరం బాధితులకు తక్షణమే మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

February 23, 2026 / 07:31 PM IST

ఏటీఎంల భద్రతపై పోలీసుల స్పెషల్ ఫోకస్

ప్రకాశం: ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా గిద్దలూరు లోని ఏటీఎం కేంద్రాల్లో సీఐ సురేష్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, రాత్రి వేళల్లో లైటింగ్ , సెక్యూరిటీ గార్డుల లభ్యతను తనిఖీ చేశారు. ఏటీఎం మిషన్లకు స్కిమ్మింగ్ పరికరాలు అమర్చడం వంటి మోసాలను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు.

February 23, 2026 / 07:31 PM IST

‘పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

VSP: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SCC పబ్లిక్ పరీక్షలను పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 133 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

February 23, 2026 / 07:26 PM IST

ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ

VSP: సింహాచలం ఆలయ పరిధిలోని గంగాధర మార్గంలో వేంచేసియున్న త్రిపురాంతకేశ్వరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు పాల్గొని స్వస్తివాచనం, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజలతో ఐదు రోజుల మహోత్సవాలకు అంకురార్పణ చేశారు.

February 23, 2026 / 07:25 PM IST

అమాసరెడ్డి కండ్రిగ వద్ద రేషన్ బియ్యం పట్టివేత

TPT: సత్యవేడు మండలం అమాసరెడ్డి కండ్రిగ సమీపంలో అడిషనల్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 1500 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేటకు చెందిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 07:25 PM IST

‘గ్రోత్ హబ్ అభివృద్ధికి యంత్రాంగం సిద్ధం’

PPM: నీతి ఆయోగ్ భారత్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన సిటీ రీజియన్స్ గ్రోత్ హబ్ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాను అభివృద్ధిలో నడిపించేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్స్ కింద జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కమిటీకి జేసీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

February 23, 2026 / 07:22 PM IST

‘సైబర్ క్రైమ్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి’

CTR: నగరి నియోజకవర్గ పుత్తూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బృందం వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం పంచాయతీలో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. సురక్షా బీమా, జీవన్ జ్యోతి బీమా, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, NPS పథకాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలపై జాగ్రత్తలు సూచించారు.

February 23, 2026 / 07:21 PM IST