ఎన్టీఆర్: నందిగామ మండలం చందాపురంలో బుధవారం రాత్రి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. రైతుల సమస్యలు, పంటల పరిస్థితులు, సాగు సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా రైతులతో చర్చించారు. ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని ఆమె వెల్లడించారు.