దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 81,758.95 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,548.73) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,992.85 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి.. 355.97 పాయింట్ల లాభంతో 81,904.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.50 పాయింట్ల లాభపడి 25,114 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా కోలుకుని రూ.88.26గా ఉంది.