జల్సా సినిమా విడుదలైన సమయంలో టిక్కెట్ల కోసం చాలా ఇబ్బంది పడినట్లు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుర్తు చేసుకున్నారు. తాను హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తిరుపతిలో జరిపిన క్రమంలో ఈ మేరకు వెల్లడించారు. మరోవైపు అనేక సినిమాలు స్కూల్ గోడ దూకి చుశానని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ ఆఫీసుకు రూ.11,41,63,672 కరెంట్ బిల్లు వచ్చింది. ఇది చూసిన అక్కడి గ్రామ సర్పంచ్, సిబ్బంది అంత బిల్లు రావడమెంటని విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ బిల్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఏసీడీ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ లో టీమిండియా, పాక్(IND vs PAK) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్(Team India) ఘన విజయం సాధించింది.
అసోంలో భూకంపం(Assam Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నాగావ్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ భూకంపం(Earthquake) సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 4.18 గంటలకు నాగావ్ పరిధిలో భూమి కంపించింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ(Food delivery App) టెక్ కంపెనీ అయిన జొమాటో(Zomato) షాకింగ్ విషయం చెప్పింది. తమ సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు జొమాటో(Zomato) తెలిపింది. ఈ నష్టాల వల్ల దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమల(Tirumala)కు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో ఆదివారం భక్తులతో కొండపై ఉన్న కంపార్టెమెంట్లన్నీ నిండిపోయాయి.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అతన్ని అభినందించారు.
తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధీలో ఈనెలలోనే 1,500 ఆశా పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
హీరో రాం చరణ్ పై తన భార్య ఉపాసన రివేంజ్ తీర్చుకుందా. ఈ వీడియో చూస్తే మాత్రం అచ్చం అలాగే అనిపిస్తుంది. కానీ అసలు విషయం తెలియాంటే ఈ స్టోరీని ఓసారి చదవండి.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
మీకెప్పుడైనా పెళ్లి కావాలని పాదయాత్ర చేస్తున్నారనే వార్త తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కర్ణాటక మాండ్యా జిల్లాలో దాదాపు 250 మంది యువకులు తమకు వధువు కావాలని ఫిబ్రవరి 23న పాదయాత్ర చేయనున్నారు. 106 కిలోమీటర్లు ప్రయాణించి శైవక్షేత్రమైన మలే మహదేశ్వర కొండల వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్..ఈ ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పన, పరిశీలన కోసం ఈనెల 14న కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు.