పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది.
హైదరాబాద్(Hyderabad) లో వేసవి తాపం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.
Crime : తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ 47ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించాడు. ఆమె అంగీకరించలేదని.. మెడపై కత్తి పెట్టి... జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు. ఈ అమానుష ఘటన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.
Balayya - Tarak : నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అది కూడా నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా.. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. మరింత కలిచివేసింది.
శివసేన పార్టీ(shiv Sena), గుర్తు (symbol) విషయమై ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) గ్రూపు భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా షాక్ తగిలింది. శివసేన, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఉద్ధవ్ థాక్రే. అయితే ఈ కేసు ఆర్...
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులు ఆదరించారు. ఇక మరో దర్శకుడు దొరైతో కలిసి భగవాన్ అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందారు. దాదాపు 30 నుంచి 40 సినిమాల దాకా వీరిద్దరూ కలిసి పని చేశారు. 2000 సంవత్సరంలో దొరై కన్నుమూయగా.. తాజాగా భగవాన్ తుదిశ్వాస విడిచారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ కుంభకోణం బయటకు రావడంతో బీజేపీ నిరాశకు గురవుతోంది. వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఈడీ సోదాలు చేపట్టింది. పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయాన దాడులు జరిగాయి. అయితే ఇవేవీ మమ్మల్ని అడ్డుకోలేవు’ అని పేర్కొన్నారు.
Amitabh : బిగ్ బీ అమితాబచ్చన్ బంధువుకి ఓ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. కాగా... ఈ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు.. హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఆలయ పున:నిర్మాణం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పాలక మండలి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం వారాంతాల్లో భక్తులు భారీగా వస్తున్నారు. ఇక ఉత్సవాలకు ఆలయం కిటకిటలాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది.
నిత్యం కేసీఆర్ వార్త మహారాష్ట్రలో వినిపిస్తుండడంతో అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా ప్రాంతంలోని నాందేడ్ లో సభ నిర్వహించడంతో మరాఠా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ హాజరవడం కూడా మరాఠా ప్రజలు మరచిపోలేదు.
బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం కన్నుమూసిన నందమూరి తారకరత్న మృత దేహాన్ని నిన్న హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు. నేడు ఉదయం.. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.
గతంలో నీళ్ల ట్యాంకులు, గుంతల్లో పడడం.. నూనె, సాంబారు తదితర వాటిల్లో పిల్లలు పడిన సంఘటనలు జరిగాయి. కానీ వాషింగ్ మెషీన్ లో బాలుడు పడిన సంఘటన బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. అయినా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. పనులు చేస్తున్నప్పుడు పిల్లలపై కూడా కన్నేసి ఉండాలి. లేదంటే ఘోర ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మనకే మేలు.