హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ గ్రౌండ్ దగ్గర ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు నిరసన చేపట్టారు. హైకోర్టు ఆదేశం ప్రకారం మ్యాన్యువల్ గా హైట్ చెక్ చేయకుండా మళ్లీ డిజిటల్ మీటరే ఉపయోగించి తమను డిస్ క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. మరోవైపు లాంగ్ జంప్, షాట్ పుట్ కూడా ఎక్కువగా పెట్టి తమకు డిస్ క్వాలిఫై చేశారని ఇంకొంత మంది వాపోయారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (contonment) బీఆర్ఎస్ (brs) ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంత కాలంగా గుండె, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన యశోద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన నాలుగు సార్లు కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తెలుగు దేశం పార్టీ నుండి గెలిచిన ఆయన 2014 తర్వాత బి అర్ ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి అదే పార్టీ నుండి విజయం సాధించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy 2023)లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా(Team India) రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ను టీమిండియా(Team India) మట్టికరిపించింది.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ రికార్డులను అధిగమించాడు.
బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరు అని ఈ ఇద్దరు నేతలు చాటారు. రాజకీయపరంగా కొట్లాడాలి కానీ కుటుంబపరంగా కలిసి ఉండాలని.. మిత్రులపరంగా కూడా కలిసి ఉండాలనేది వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ తో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడేవారు. వీరిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేసేవాళ్లు. కానీ రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం(inflation) క్రమంగా పెరుగుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో చికెన్ 700 రూపాయలు దాటగా, లీటర్ పాలు రూ.200కు చేరాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకునేందుకు రెండు గోల్ఫ్ క్లబ్లను విక్రయించనున్నట్లు చెప్పారు.
పరామర్శ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యం, అంత్యక్రియలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. విజయసాయిరెడ్డి తారకరత్న బంధువు. అందుకే దగ్గరుండి తారకరత్న కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
Kanna : ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయానికి నేతలు.. తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ లు మారాలి అనుకునేవారు మారుతున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ కూడా... బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే టీడీపీలో చేరేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు.
మాస్ మహారాజ రవితేజ నటించిన రవణాసుర మూవీ నుంచి తానే స్వయంగా పాడిన ప్యార్ లోనా పాగల్ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ చూసిన అభిమానులు అదుర్స్ అంటున్నారు. ఇక మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.
ఎద్దుతో పాటు ఆ యువకుడికి పసుపు పెట్టారు. మంగళ స్నానాలు చేయించారు. ఇక పెళ్లికి భజనలు చేశారు. బాజాభజంత్రీలు వాయించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ భోజనాలు వడ్డించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డబ్బు, అభరణాలతో హైవేపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ డెలివరీ వ్యాన్లో ఉన్న రూ.3.88 కోట్ల విలువైన 1400 కిలోల వెండి, ఇతర ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఆ క్రమంలో డ్రైవర్, క్లినర్లపై దాడి చేసి అభరణాలు ఎత్తుకెళ్లారు.
తారకరత్నకు కుటుంబసభ్యులు, ప్రముఖులతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిలలో ఉన్న తారకరత్న నివాసాలను ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తారకరత్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.
News : మహా శివరాత్రి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఈ ఆనందోత్సవాల నడుమ ఆంధ్రప్రదేశ్ లో విషాదం నెలకొంది.