మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, రాద్దాంతానికి తెరదించాలని భావించారు.
జీవిత మళ్లీ రాజకీయ జీవితంలో చురుకయ్యారు. బీజేపీ పుంజుకోవడంతో ఆమె సందడి మొదలైంది. ఇటీవల తరచూ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. వేదిక ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూషించేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్న బీజేపీ అందులో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నది.
అదానీ గ్రూప్ సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సంస్థపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ ఛైర్పర్సన్ మాధబి పూరీ బుచ్లకు రెండు వేర్వేరుగా లేఖలు రాస్తూ డిమాండ్ చేశారు.
Thakre - Komati Reddy : తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు... పార్టీకి తిప్పలు తెచ్చిపెడుతున్నాయి.
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు జరగాలని సీఎం కేసీఆర్ సూచించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలు కూడా అప్పగించారు. సీఎం ఆదేశాలతో ఆనంద్ సాయి రెండు రోజులుగా కొండగట్టులో బస చేశారు. ఆలయాన్ని మొత్తం పరిశీలించారు. ప్రకారాలు, ప్రహరీ, ఆలయం లోపల అన్నింటిని పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్ తయారీ, పర్యవేక్షణ బాధ్యతలు ఆనంద...
Mahesh-Rajamouli : ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలె ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న ఫిల్మ్ కావడంతో.. ఎస్ఎస్ఎంబీ 28 అదిరిపోయేలా ఉంటుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో (BBC) వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు సర్వే చేస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే అనుమానంతో ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
ప్రేమికుల రోజు(lovers day)న దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో విషాద ఘటన చేటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ధాబా రిఫ్రిజిరేటర్లో ఉంచి, ప్రేమికుల రోజున మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Turkey Earth Quake : టర్కీలో సంభవించిన భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. టర్కీ, సిరియాలో సంభవించిన ఈ భూకంపం వలన సుమారు రూ. 7 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్య 72 వేలు దాటే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. శిధిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్నది.
చిత్తూరు జిల్లాలో కీలక నాయకురాలిగా వ్యవహరించిన ఆమె ఉమ్మడి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. ఆమె మృతికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించారు. ఆమె ప్రజలకు విశేష సేవలు అందించారని స్మరించుకున్నారు.
Bala Krishna : గత కొన్ని రోజులుగా నందమూరి తారకరత్న పరిస్థితి ఎలా ఉంది.. హెల్తే అప్డేట్ ఏంటని.. టెన్షన్ పడుతునే ఉన్నారు అభిమానులు. పాదయాత్రలో కుప్పకూలిపోయిన తారకరత్నకు.. ముందుగా అస్వస్థత అన్నారు.. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ అన్నారు.. కానీ చివరకు పరిస్థితి విషమన్నారు. వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఎకో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విదేశాలకు తీసుకెళ్లాలని యత్నించారు. కానీ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో రూ.100 నాణెం పైన ఆయన బొమ్మను ముద్రించనున్నారు. ఈ నాణేన్ని పూర్తిగా వెండితో తయారు చేస్తారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేరళ, తమిళనాడు, కర్ణాటకలో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. కోయంబత్తూరు కారు పేలుడు కేసు, మంగళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు దాడులపై అనుమానిత ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు.
BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ(chetan sharma) వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రయివేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో (sting operation) భాగంగా వీటిని బయట పెట్టింది.