6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రెండు రోజుల పాటు వైన్ షాపులు హైదరాబాద్, సికింద్రాబాద్(hyderabad secunderabad) ప్రాంతాల్లో బంద్ కానున్నాయి. హోలీ పండుగ(Holi effect) సందర్భంగా మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు(Wine shops) బంద్ కానున్నాయి. ఈ మేరకు రాచకొండ సీపీ(CP) డీఎస్ చౌహన్ ప్రకటించారు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. అంటే దీనిని క్లుప్తంగా టీఆరెఎస్ అని పిలువవచ్చు. టీఆరెఎస్ అని వచ్చేలా మరిన్ని కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి వంటి పేర్ల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ గా మారిన తర...
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.
ఈ మధ్య కాలంలో టర్కీ(Turkey), సిరియా(Syria)లో వినాశకరమైన భూకంపాలు(Earthquakes) సంభవించిన సంగతి తెలిసిందే. ఆ దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. భూకంపం(Earthquake) ధాటికి న్యూజిలాండ్(New Zealand) భూమి మరోసారి కంపించింది. శనివారం న్యూజిలాండ్(New Zealand)లో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
ఏపీ సర్కార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara rao) టీటీడీ(TTD)కి షాక్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావును వరించిన టీటీడీ(TTD) సలహాదారు పదవిని ఆయన తిరస్కరించాడు. టీటీడీ(TTD) ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం బ్రిటన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం తన లుక్ మొత్తం మార్చేసిన ఆయన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా... మరో 10 రోజుల పాటు ఆయన బ్రిటన్ లోనే ఉండనున్నారు. అక్కడ జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Batti Vikramarka : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ ని ప్రధాని చేయడం అంటూ.... కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఈరోజు జరిగిన హాత్ సే హాత్ జోడో సమీక్ష సమావేశం లో మాట్లాడిన ఆయన పలు విషయాలను తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించిన ఆయన... వైఎస్సార్ ప్రస్త...
బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.1000 కోట్ల సినిమా(movie)లో భాగం కావడం కంటే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడం తనకు "చాలా ఎక్కువ సంతృప్తిని" ఇస్తుందని వెల్లడించారు. మరోవైపు పరోక్షంగా పఠాన్ మూవీని విమర్శించారని పలువురు అంటున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏరియల్ స్టంట్స్(aerial stunts) చేస్తూ అభిమానులను(fans) ఆకట్టుకున్నారు. ఈ సంఘటన దృశ్యాలు అమెరికా(america)లో ఎంటర్టైనర్ ఓపెనింగ్ షో సందర్భంగా చోటుచేసుకున్నాయి. ఈ క్రేజీ వీడియోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Sidda Ramaiah : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సద్ధరామయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విరూపక్షను అరెస్టు చేయాలంటూ ఆయన తన పార్టీ నేతలతో కలిసి డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు, ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మాదాల్ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన ఉదంతం రాష్ట్రవ్యాప్త సంచలనం రేపింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.
Venkaiah Naidu : రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయని, ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృ భాషలో ప్రాథమిక విద్య మొదలుపెట్టాలని కోరారు.
నిన్న(మార్చి 3న) విడుదలైన బలగం(Balagam) సినిమా(movie) ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను పొందింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్(box office) వద్ద దేశవ్యాప్తంగా 70 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 65 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ సినిమాకు 6 నుంచి 8 కోట్ల రూపాయలు బడ్జెట్(budget) అయినట్లు తెలుస్తోంది.