వరుసగా దాడులు చేస్తుండడంతో కలకలం రేపుతున్నది. అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీతో పాటు ఈడీ (Enforcement Directorate) దాడులు కూడా తరచూ జరుగుతున్నాయి.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం పలు చోట్ల భూకంపాలు(Earthquake) చోటుచేసుకున్నాయి. మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.46 గంటలకు నోనీలో భూ ప్రకంపనలు జరిగాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై 3.2 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ లో కూడా భూకంపాలు(Earthquakes) వచ్చాయి.
జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రజలు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి. దీనిపై ప్రతిపక్షాలు సీఎం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి పర్యటన సమయంలో కూడా అవే దృశ్యాలు కనిపించాయి. కానీ ఈసారి వైసీపీ మరింత రెచ్చిపోయి చివరకు మొక్కజొన్న కంకులకు కూడా పార్టీ రంగులు (YCP Colors) వేయడం గమనార్హం.
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మెడికో ప్రీతి(Medico Preeti) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజిఎం(MGM) ఆస్పత్రిలో మెడిసిన్ చేస్తున్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ నిమ్స్(NIMS)లో ఆమెకు వైద్య చికిత్స అందించినా కోలుకోలేకపోయింది. తాజాగా ప్రీతి కేసు(Preeti Case)లో తెరపైకి మరో కొత్త కారణం బయటికొచ్చింది.
భర్తతో గొడవపడి జీవితం మీద విరక్తితో పాపతో సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. వెంటనే స్పందించిన దిశా పోలీసులు ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. అతడికి సర్దుబాటు చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని దిశా పోలీసులు హితవు పలికారు.
డొక్కు వాహనం తనకు వద్దని మంచి కండిషన్ లో ఉన్న వాహనం కేటాయించాలని రాజా సింగ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆయన చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి తాజాగా ఇన్నోవా వాహనం కల్పించింది. అయితే ఈ వాహనం కూడా పాతదే. 2017 మోడల్ కావడం గమనార్హం. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ వాహనం ఏదైనా పర్లేదు. కానీ మంచి కండీషన్ లో ఉంటే చాలని పేర్కొన్నాడు.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా టర్కీ(Turkey)లో మరోసారి భూకంపం సంభవించింది. మలాట్యా ప్రావిన్స్ లోని ఎసిల్యర్ట్ నగరంలో సోమవారం భారీ భూకంపం(Earthquakes) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఈ భూకంపం వల్ల అనేక భవనాలు కుప్పకూలాయి. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
తిరుపతి(Tirupathi)లోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రి(Padmavathi childrens hospital) మరో బిడ్డకు ప్రాణం పోసింది. నెల రోజుల వ్యవధిలోనే రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. పక్కా ప్రణాళికతో గ్రీన్ ఛానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్(Brain Died) అయిన రెండేళ్ల బాలుడి గుండెను సేకరించి తిరుపతిలోని 13 ఏళ్ల పాపకు ప్రాణం పోసింది. ఈ విషయాన్ని టీటీడీ(TTD)...
KTR : మెడికో ప్రీతి మరణ వార్త తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ వేధింపులు తాళలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
సామాన్యులకు మళ్లీ షాక్ తగిలింది. కేవలం నెల రోజుల్లోనే వేరుశనగ నూనె(Peanut Oil) ధర మరోసారి పెరిగింది. లీటరుకు రూ.15 నుంచి రూ.20లకు చేరింది. ఫిబ్రవరి 26వ తేదికి వేరుశనగ నూనె(Peanut Oil) ధర లీటరుకు రూ.180కి చేరింది. పామాయిల్(Palm Oil) ధర చూసినట్లైతే లీటరుకు రూ.3 నుంచి రూ.5లకే పెరిగింది. దీంతో ప్రస్తుతం పామాయిల్(Palm Oil) ధర రూ.104లకు చేరింది. ఇకపోతే పొద్దుతిరుగుడు నూనె(Sunflower Oil) ధర లీటరకు రూ....
గుజరాత్లో వరుస భూకంపాలు(Earthquake) భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం రాజ్ కోట్ వద్ద భూకంపం(Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మరో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు(Earthquake) జరగడంతో ప్రజలు భయాందోళన చెందారు.
Ayyanna Pathrudu : టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో ఊహించని షాక్ తగిలింది. అయ్యన్నపాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 467 కింద దర్యాప్తు చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ను కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, డెలినా కోంగ్డప్ లను కూడా నియమించారు. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
Medico Preethi : మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలోని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో మహిళల విషయంలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై వివక్ష కొనసాగుతోంది. ఈ దేశాల్లో పాలకుల నుంచి మహిళలు, బాలికల పట్ల కఠిన రూల్స్ ఎదురవుతున్నాయి. తాజాగా ఇరాన్ లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విష ప్రయోగం చేసిన ఘటన వెలుగుచూసింది.