MLG: గోదావరి పుష్కరఘాట్ల ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని పుష్కరఘాట్లను శుక్రవారం పరిశీలించారు. జూలై 2027లో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్ల నిర్మాణాల పనులు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే అందించాలన్నారు.