తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...
రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా ఇంకా విభజనకు సంబంధించిన అంశాలు పరిష్కారం కాలేదు. సంస్థలు, నిధులు, ఉద్యోగుల విషయమై రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు రావాల్సిన బకాయిలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన నిధులు తెలంగాణకు చెల్లించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. విభజన మొదటి ఏడాది ...
కామం మైకంలో వావివరసలు చూడడం లేదు. పిల్లాజెల్లా అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను కూడా దుర్మార్గులు చిదిమేస్తున్నారు. అలా ఒకరు మేనమామ వరుసైన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర...
తన ఉద్యోగం మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్ సంఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వెళ్లిందో ఎవరి ఇంటికో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ ఇంటికే. అర్ధరాత్రి జరిగిన సంఘటనపై తాజాగా స్మితా సభర్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో...
తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నారు. గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ జాతీయవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇక గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పర్యటనలకు అధికార యంత్రాంగం సహకరించడం లేదు. దీనిపై తరచూ ఆమె మీడియా ముందు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రస్తావి...
మహిళలపై నేరాలను అరికట్టడంలో న్యాయస్థానాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అబలలకు అండగా కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు ఉండడంతో కొద్దోగొప్పో మహిళలపై అఘాయిత్యాలు అదుపులో ఉన్నాయి. తాజాగా కేరళ ఉన్నత న్యాయస్థానం సంచలన ప్రకటన చేసింది. పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్ మాదిరి నో మీన్స్ నో (వద్దంటే వద్దు) అని కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మహిళ లేదా బాలిక వద్దంటే వద్దు అనే అర్థమని, దీన్ని పుర...
ఉద్యోగం కోసం ఐఏఎస్ అధికారిణిని ప్రసన్నం చేసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ సాహసానికి ఒడిగట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంపన్నులు ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిపోయాడు. భయపడిపోయిన అధికారిణి కేకలు వేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం...
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఇప్పటి నుంచే రాజకీయం రసకందాయంగా మారింది. పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకట...
మేషం మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధు ప్రీతి అధికంగా ఉంది. మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనిలో సఫలీకృతమవుతారు. ఒక శుభవార్త వింటారు. ఈ రోజు మీరు గో సేవ చేస్తే ఫలితం దక్కుతుంది. వృషభం ఈ రాశివారు కీలకమైన పనులను నేడు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. మొహమాటంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటిస్తే మేలు. ఈ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ...
భగభగమండే సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ గుర్తించింది. దక్షిణ భారత్ లో పళని పర్వతాలపై కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతి పెద్ద మచ్చను గుర్తించింది. ఆ సన్ స్పాట్ కు ఏఆర్3190 అనే నామకరణం చేసింది. సూర్యుడి ఉపరితలంపై ఉండే నల్లటి భాగాలే మచ్చలుగా కనిపిస్తాయని, వాయువులు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలుగా తయారవుతాయని న...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై శనివారం ముఖ్యమంత్ర...
హాత్ సే హాత్ జోడో యాత్ర ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. భద్రాచలం రాముల వారి సన్నిధి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీభవన్ లో శనివారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఇతర సీనియర్ నాయకులతో హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చించారు. పాదయాత్ర ఎక్కడ ప్రారంభిం...
తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. నిన్న అంతా ఒకే అనుకుంటే తెల్లారే గాంధీభవన్ లో వివాదం రాజుకుంది. పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేస్తున్న కోమటిరెడ్డి లాంటి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ ఓటమికి కోమటిరెడ్డి కారణమని...
దక్కన్ షాపింగ్ మాల్లో కాలిన మృతదేహన్ని రెస్క్యూ సిబ్బంది ఈరోజు (శనివారం) గుర్తించారు. మొదటి అంతస్తు వెనకభాగంలో అది కనిపించిందని తెలిపారు. మాంసపు ముద్దలు కూడా ఉన్నాయన్నారు. వాటిని మెడికల్ టెస్ట్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామన్నారు. డీఎన్ఏ చేసిన తర్వాత చనిపోయింది ఎవరో తేలే అవకాశం ఉంది. మరో ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. ఆనవాళ్ల కోసం గాలింపు చేపడుతున్నారు. వేడి వల్ల ఆటంకం కలుగుతుంది. ఈరోజు ఉదయం ఇంజ...
స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించింది. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, తనపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని రష్మీ తెలిపింది. ప్రమీల మిశ్రా భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ తన వెంట ఉంటాయంది. తన గ్రాండ్ మదర్ ను తలచుకుంటూ రష్మీ గౌతమ్ ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ కామెంట్స్ [&hel...