కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) బెయిల్(bail) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13 వరకు బెయిల్ ను పెంచినట్లు తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల కుటుంబం ఇచ్చిన పార్టీలో ఢిల్లీ ప్రముఖ వంటకం దౌలత్ కీ చాట్ తో పాటు టిష్యూ పేపర్లకు బదులు రూ.500 నోట్ల కరెన్సీ నోట్లను ఉంచారు. అయితే ఇవి నకిలీవి.
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పరీక్ష ఈ నెలలో జరగనుంది. ఆ కొశ్చన్ పేపర్ నిందితుడు ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు.
గత ఏడాది మద్యం విక్రయాలు రంగారెడ్డి జిల్లాలో జోరుగా జరిగాయి. ఆ తర్వాత స్థానం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి దక్కించుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాల నుంచి రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది.
ఏడాది లోపు ఎన్నికలు జరుగుతాయని, కాబట్టి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గడప గడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను, మంత్రులను, నియోజకవర్గ ఇంచార్జులను ఆదేశించారు జగన్.
తెలంగాణ(telangana)లో టెన్త్ ఎగ్జామ్స్ ఈరోజు ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నపత్రం లీక్(10th question paper leaked) అయిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పలువురి వాట్సాప్ ఖాతాల్లో(WhatsApp groups) క్వశ్ఛన్ పేపర్ ప్రత్యక్షం కావడంతో అధికారులతోపాటు విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు.
సీబీఐ(CBI) ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వజ్రోత్సవ వేడుకలను ప్రధాని మోదీ(pm modi) సోమవారం విజ్ఞాన్ భవన్లో ప్రారంభించిన క్రమంలో ప్రసంగించారు. మరోవైపు 2014 తర్వాత దేశంలో అవినీతి పరులకు భయం పట్టుకుందని పేర్కొన్నారు.
జార్ఖండ్(jharkhand) పోలీసులతో ఛత్రా(chatra)లో జరిగిన ఎన్కౌంటర్(Encounter)లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. హత్యకు గురైన ఐదుగురిలో ఇద్దరి తలలపై రూ.25 లక్షలు, మరో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయని ప్రకటించారు.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రూల్స్ అతిక్రమించి నిధులు మళ్లించిన కేసులో సంస్థ ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao), శైలజా కిరణ్(Sailaja Kiran)లను నేడు ఏపీ సీఐడీ విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశారు.
అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల వాల్తేరు వీరయ్యలో దేవి చేసిన సందడి మామూలుగా లేదు. కాకపోతే ఆ సినిమాలో దేవి సంగీతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఘర్షణలు, మంటలు చెలరేగించి దానితో చలి కాచుకునే లక్షణం బీజేపీకి ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. చెలరేగిన అల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
నీచపు పనితో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసి సాగనంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా మరో ఎమ్మెల్యేను సాగనంపే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం కలకలం రేపింది.