పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఎవరూ చంద్రబాబుకు ఓటేయరని చెప్పారు.
పెళ్లైన రెండు రోజులకే వరుడు ఆకస్మాత్తుగా మరణించాడు. అయితే తనకు వచ్చిన హోం థియేటర్(home theater) పేలిన(blast) క్రమంలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వరుడితోపాటు అతని బంధువు కూడా ఒకరు మృతి చెందగా, ఇంకో ఏడుగురికి గాయలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్(chhattisgarh)లోని రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు కొశ్చన్ పేపర్ లీకయ్యింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్యూఐ ఏకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
దేశంలో(india) కొత్తగా 3,641 కరోనా కేసులు(corona cases) నమోదు కాగా..మరో 11 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 20,219కు పెరిగింది. ఈ క్రమంలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 6.12 శాతం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
జార్ఖండ్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు ఉన్నారు. వీరి తలపై రూ.25 లక్షల చొప్పున రికార్డు ఉంది.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు 10వ తరగతి పరీక్షలు(10th question paper leaked) మొదలైన ఏడు నిమిషాలకై ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అక్కడి కలెక్టర్ నారాయణ రెడ్డి(narayana reddy) ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ చేయడంలో ఉపాధ్యాయుడు బందెప్ప పాత్ర ఉన్నట్లు పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు.
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) కస్టమరా... అయితే ఈ అలర్ట్ (PNB Customers Alert) మీ కోసమే. బ్యాంకు ఖాతాలో సఫిసియెంట్ బ్యాలెన్స్ లేకుండానే మీరు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అవుతుంది.
యూఏఈకి చెందిన ఓ నాలుగేళ్ల బుడ్డోడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. అబుదాబికి చెందిన లిటిల్ సయీద్ రషెద్ అల్ మహీరి(Little Saeed Rashed AlMheiri) 4 సంవత్సరాల 218 రోజుల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు(Worlds Youngest Author) సృష్టించాడు. ఆ క్రమంలో ఆ పిల్లాడు రచించిన ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్ బుక్ వెయ్యికిపైగా కాపీలు అమ్మడు కావడం విశేషం.
టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేద్దామని విపక్షాలను షర్మిల కోరారు. ఇందులో అన్నీ పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చెప్పారు. కోదండరాం అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పారు.